తెలంగాణలో ఐదురోజులపాటు వర్షాలే వర్షాలు
- June 19, 2024
హైదరాబాద్: తెలంగాణలో రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను ఇష్యూ చేసింది. రానున్న ఐదు రోజులు అనగా నేటి నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయిని.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కూడా ఉండటం వల్ల.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాక గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ, ఇతరాత్ర పనుల కోసం బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని.. ఆవర్తనం కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయి అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ను జారీ చేశారు.
తాజా వార్తలు
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం









