తెలంగాణలో ఐదురోజులపాటు వర్షాలే వర్షాలు
- June 19, 2024
హైదరాబాద్: తెలంగాణలో రాగల ఐదురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను ఇష్యూ చేసింది. రానున్న ఐదు రోజులు అనగా నేటి నుంచి జూన్ 25 వరకు రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు కురుస్తాయిని.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతపవనాలకు తోడు ద్రోణి ప్రభావంతో కూడా ఉండటం వల్ల.. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పుకొచ్చారు. అంతేకాక గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వ్యవసాయ, ఇతరాత్ర పనుల కోసం బయటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతోందని.. ఆవర్తనం కారణంగా తెలంగాణతో పాటు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఆసిఫాబాద్, ములుగు, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్తో పాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడతాయి అన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలెర్ట్ను జారీ చేశారు.
తాజా వార్తలు
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- విషాదం..సైనికుడి మృతికి యూఏఈ సంతాపం..!!







