నలంద యూనివర్సిటీ..పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు..కానీ జ్ఞానం కాదు : మోదీ
- June 19, 2024
బిహార్ లోని రాజ్గిర్లో ఈరోజు(బుధవారం) ప్రధాని మోదీ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వి. అర్లేకర్, సీఎం నీతిష్ కుమార్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నలంద యూనివర్సిటీ.. భారత వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని అన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని ప్రశంసించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు గాని.. జ్ఞానం కాదన్నారు.
ఇదిలా ఉండగా.. ఐదో శతాబ్దంలో ఏర్పాటుచేసిన పురాతన నలంద యూనివర్సిటీలో అప్పట్లో ఒకానొక టాప్ యూనివర్సిటీగా ఉండేది. ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. నలంద విశ్వవిద్యాలయం దాదాపు 800 ఏళ్ల పాటు సేవలందించిందని నిపుణులు తెలిపారు. 12వ శతాబ్ధంలో భారత్లోకి చొరబడ్డ అఘ్గన్లు ఈ యూనివర్సిటీని కూల్చివేశారు. అందులో ఉన్న పుస్తకాలను, మాన్యుస్క్రిప్ట్లను తగులబెట్టేశారు. అయితే 2016లో ఐక్యరాజ్యసమితి ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించింది.
A memorable mix of history and education. Nalanda is truly special. Here are today’s highlights. pic.twitter.com/J17pxCwUD1
— Narendra Modi (@narendramodi) June 19, 2024
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









