దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 23, 2024
దుబాయ్: దుబాయ్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో సీజీఐ అండ్ ఎఫ్ఓఐ ఈవెంట్స్ జూన్ 22న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం దుబాయ్లోని ఐకానిక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగింది. ఇందులో 1500 మంది పాఠశాల విద్యార్థులతో సహా ఐదు వేల మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంపొందిస్తూ అనుభవజ్ఞులైన యోగా మాస్టర్లు వారితో యోగాసనాలు చేయించారు. సామరస్యం, అంతర్గత శాంతిని ప్రతిబింబించే ఈ పురాతన యోగా అభ్యాసాన్ని జరుపుకోవడానికి దాదాపు 50 దేశాలకు చెందిన యోగా ఔత్సాహికులు ఒకచోట చేరారు. ఈ ఈవెంట్ను గ్రాండ్గా విజయవంతం చేయడంలో పాల్గొన్న వారందరికీ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కృతజ్ఞతలు తెలిపాయి.




తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







