దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

- June 23, 2024 , by Maagulf
దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

దుబాయ్: దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో సీజీఐ అండ్ ఎఫ్ఓఐ ఈవెంట్స్ జూన్ 22న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం దుబాయ్‌లోని ఐకానిక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగింది. ఇందులో 1500 మంది పాఠశాల విద్యార్థులతో సహా ఐదు వేల మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంపొందిస్తూ అనుభవజ్ఞులైన  యోగా మాస్టర్లు వారితో యోగాసనాలు చేయించారు. సామరస్యం, అంతర్గత శాంతిని ప్రతిబింబించే ఈ పురాతన యోగా అభ్యాసాన్ని జరుపుకోవడానికి  దాదాపు 50 దేశాలకు చెందిన యోగా ఔత్సాహికులు ఒకచోట చేరారు.  ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో  పాల్గొన్న వారందరికీ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కృతజ్ఞతలు తెలిపాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com