2024లో 156 మోటర్ సైకిల్స్ స్వాధీనం
- June 23, 2024
బహ్రెయిన్: రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడానికి బహ్రెయిన్ సిద్ధమైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే నమోదుకాని మోటార్సైకిళ్లు మరియు రైడర్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కఠినమైన చర్యలను తీసుకుంటుంది. ఇటీవలి రెండు వారాల క్యాంపెయిన్ లో అధికారులు 28 మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ సంవత్సరం మొత్తం నమోదుకాని బైక్ల సంఖ్య 156కి చేరుకుంది. ముఖ్యంగా నివాస ప్రాంతాలలో నమోదుకాని మోటార్సైకిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ హైలైట్ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరియు హెల్మెట్ ధరించడం వంటి ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి, రహదారి వినియోగదారులందరికీ భద్రత కల్పించాలని రైడర్లను కోరింది. డ్రైవర్ల నిర్లక్ష్య ప్రవర్తనను నివారించడంలో తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమని, ఇది రైడర్లు మరియు ఇతరులను ప్రమాదాల నుంచి కాపాడుతుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









