2024లో 156 మోటర్ సైకిల్స్ స్వాధీనం
- June 23, 2024
బహ్రెయిన్: రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలను అమలు చేయడానికి బహ్రెయిన్ సిద్ధమైంది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే నమోదుకాని మోటార్సైకిళ్లు మరియు రైడర్లపై జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కఠినమైన చర్యలను తీసుకుంటుంది. ఇటీవలి రెండు వారాల క్యాంపెయిన్ లో అధికారులు 28 మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ సంవత్సరం మొత్తం నమోదుకాని బైక్ల సంఖ్య 156కి చేరుకుంది. ముఖ్యంగా నివాస ప్రాంతాలలో నమోదుకాని మోటార్సైకిళ్ల వల్ల కలిగే ప్రమాదాలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ హైలైట్ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మరియు హెల్మెట్ ధరించడం వంటి ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి, రహదారి వినియోగదారులందరికీ భద్రత కల్పించాలని రైడర్లను కోరింది. డ్రైవర్ల నిర్లక్ష్య ప్రవర్తనను నివారించడంలో తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమని, ఇది రైడర్లు మరియు ఇతరులను ప్రమాదాల నుంచి కాపాడుతుందని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









