నీట్ పరీక్షల వివాదం.. ఆందోళనలో యూఏఈ స్టూడెంట్స్..!
- June 24, 2024
యూఏఈ: అనేక మంది భారతీయ విద్యార్థుల మాదిరిగానే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షపై ఆందోళనగా ఉన్నట్లు యూఏఈలో పలువురు విద్యార్థులు తెలిపారు. నీట్ ఎంట్రన్స్ అనేంది భారతదేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్ష. ఇండియాలో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే, ఇటీవల వెలువడిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించారు. వారిలో ఆరుగురు ఒకే కోచింగ్ సెంటర్కు చెందినవారు కాగా, పరీక్ష ప్రారంభం ఆలస్యం కావడంతో 1,500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు లభించాయి. గత సంవత్సరం కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే AIR 1 వచ్చింది. విద్యార్థి సంఘాల నిరసనలు ఇండియాను కుదిపేస్తోంది. పలు రాస్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్లు కేసులు నమోదు అవుతున్నాయి. "ఇది మాకు చాలా బాధాకరమైన సమయం." శంకరాసన్ అన్నారు. మరోవైపు జూన్ 23వ తేదీన (ఆదివారం) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-PG వాయిదా పడింది. ఇదిలా ఉండగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు ఆరు నగరాల్లో పునఃపరీక్ష జరిగింది. అందులో సగం మందే హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు









