నీట్ పరీక్షల వివాదం.. ఆందోళనలో యూఏఈ స్టూడెంట్స్..!

- June 24, 2024 , by Maagulf
నీట్ పరీక్షల వివాదం.. ఆందోళనలో యూఏఈ స్టూడెంట్స్..!

యూఏఈ: అనేక మంది భారతీయ విద్యార్థుల మాదిరిగానే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షపై ఆందోళనగా ఉన్నట్లు యూఏఈలో పలువురు విద్యార్థులు తెలిపారు.  నీట్ ఎంట్రన్స్ అనేంది భారతదేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్ష. ఇండియాలో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే, ఇటీవల వెలువడిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించారు. వారిలో ఆరుగురు ఒకే కోచింగ్ సెంటర్‌కు చెందినవారు కాగా, పరీక్ష ప్రారంభం ఆలస్యం కావడంతో 1,500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు లభించాయి. గత సంవత్సరం కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే AIR 1 వచ్చింది. విద్యార్థి సంఘాల నిరసనలు ఇండియాను కుదిపేస్తోంది. పలు రాస్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్లు కేసులు నమోదు అవుతున్నాయి. "ఇది మాకు చాలా బాధాకరమైన సమయం." శంకరాసన్ అన్నారు. మరోవైపు జూన్ 23వ తేదీన (ఆదివారం) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-PG వాయిదా పడింది.  ఇదిలా ఉండగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు ఆరు నగరాల్లో పునఃపరీక్ష జరిగింది.  అందులో సగం మందే హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com