తప్పుడు వార్తల పై కువైట్ మంత్రివర్గం సీరియస్..!
- June 26, 2024
కువైట్: విశ్వసనీయత మరియు జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టివేసే సోషల్ మీడియా , ఇతర మీడియా వార్తలను కువైట్ కేబినెట్ తప్పుబట్టింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారం తీవ్రమైన అనర్ధాలను కలుగజేస్తుందని పేర్కొంది. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన బయాన్ ప్యాలెస్లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న చర్యలపై ఇటీవల అవాస్తవ నివేదికలను ప్రచురించినందుకు ఇది కొన్ని సోషల్ మీడియా సైట్లు మరియు వార్తా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలను ప్రచురించడం లేదా తిరిగి ప్రచురించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారంతో ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









