కార్ల పేరిట BD250,000 ఫ్రాడ్.. 39 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- June 27, 2024
మనామా: కాపిటల్ గవర్నరేట్ పోలీసులు 39 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను రాజ్యానికి తక్కువ ధరలకు కార్లను దిగుమతి చేసుకోవడానికి అంగీకరించి బాధితులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అనుమానితుడు వాహనాలను డెలివరీ చేయకుండా బాధితుల నుండి డబ్బును తీసుకొని, నకిలీ బీమా పత్రాలను రూపొందించాడు. ఇలా పలువురి నుంచి సుమారు BD250,000 మొత్తాన్ని తీసుకొని మోసాలకు పాల్పడ్డారని క్యాపిటల్ గవర్నరేట్ పోలీసులు తెలిపారు. విచారణలో, అనుమానితుడు విదేశీ పరిచయాల ద్వారా తక్కువ ధరకు కార్లను సోర్స్ చేయగలనని చెప్పడం ద్వారా తనకు డబ్బు పంపమని బాధితులను నమ్మించాడని వెల్లడైంది. అయినప్పటికీ, అతను చెల్లింపులను స్వీకరించిన తర్వాత ఎప్పుడూ కార్లను అందించలేదనరి, ఇది మొత్తంగా వివిధ వ్యక్తుల నుండి దాదాపు BD250,000 వరకు సేకరించాడని గుర్తించారు. చట్ట ప్రకారం చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని క్యాపిటల్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







