శరీరంలోని వేడి తగ్గించుకునే మార్గాలివే.!
- June 28, 2024
కొందరికి ఒంట్లో విపరీతమైన వేడి వుంటుంది. ఎప్పుడూ చేతులూ, కాళ్లూ వేడిగా వుంటుంటాయ్. శరీరం కూడా జ్వరం తాలూకు లక్షణాలు లేకున్నా వేడిగా అనిపిస్తుంటుంది.
సహజసిద్ధమైన ఉస్ణోగ్రతే అయినా కొన్ని సార్లు ఈ వేడిని తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. నిరంతరం చన్నీటిలో వుండాలనిపించేలా.. లేదంటే ఏసీలోనే వుండాలనిపించేలా శరీరం ప్రోత్సహిస్తుంది.
కానీ, అది మంచిది కాదు, అలా శరీర ఉష్ణోగ్రతని తగ్గించుకోవాలనుకునేవారు ఈ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే. ఆరోగ్యంగా వుండాలంటే ఖచ్చితంగా డైట్లో కొన్ని పండ్లు రెగ్యులర్గా చేర్చుకోవాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలో 90 శాతం నీరే వుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో అత్యంత కీలకంగా పని చేస్తుంది. అలాగే నిమ్మకాయలోని సి విటమిన్ ఆరోగ్యానికి అనేక రకాల మంచి చేయడంతో పాటూ, అననుకూల శరీర ఉష్ణోగ్రతల్ని తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
దానిమ్మ కాయలో రక్త ప్రసరణను మెరుగు పరిచి శరీరంలో తేమ శాతం పెంచే గుణం ఎక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా వుండేవారు దానిమ్మకాయల్ని రెగ్యులర్గా తింటుండాలి.
పైనాపిల్, బొప్పాయి పండ్లలోని బ్రోమోలిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ, శరీరాన్ని కూల్గా వుంచడంలో తోడ్పడుతుంది. అందుకే వారంలో రెండు సార్లయినా ఈ పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!









