శరీరంలోని వేడి తగ్గించుకునే మార్గాలివే.!
- June 28, 2024
కొందరికి ఒంట్లో విపరీతమైన వేడి వుంటుంది. ఎప్పుడూ చేతులూ, కాళ్లూ వేడిగా వుంటుంటాయ్. శరీరం కూడా జ్వరం తాలూకు లక్షణాలు లేకున్నా వేడిగా అనిపిస్తుంటుంది.
సహజసిద్ధమైన ఉస్ణోగ్రతే అయినా కొన్ని సార్లు ఈ వేడిని తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. నిరంతరం చన్నీటిలో వుండాలనిపించేలా.. లేదంటే ఏసీలోనే వుండాలనిపించేలా శరీరం ప్రోత్సహిస్తుంది.
కానీ, అది మంచిది కాదు, అలా శరీర ఉష్ణోగ్రతని తగ్గించుకోవాలనుకునేవారు ఈ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే. ఆరోగ్యంగా వుండాలంటే ఖచ్చితంగా డైట్లో కొన్ని పండ్లు రెగ్యులర్గా చేర్చుకోవాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలో 90 శాతం నీరే వుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో అత్యంత కీలకంగా పని చేస్తుంది. అలాగే నిమ్మకాయలోని సి విటమిన్ ఆరోగ్యానికి అనేక రకాల మంచి చేయడంతో పాటూ, అననుకూల శరీర ఉష్ణోగ్రతల్ని తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
దానిమ్మ కాయలో రక్త ప్రసరణను మెరుగు పరిచి శరీరంలో తేమ శాతం పెంచే గుణం ఎక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా వుండేవారు దానిమ్మకాయల్ని రెగ్యులర్గా తింటుండాలి.
పైనాపిల్, బొప్పాయి పండ్లలోని బ్రోమోలిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ, శరీరాన్ని కూల్గా వుంచడంలో తోడ్పడుతుంది. అందుకే వారంలో రెండు సార్లయినా ఈ పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







