డేటా ట్యాంపరింగ్.. SR500,000 జరిమానా
- June 29, 2024
రియాద్: సౌదీ అరేబియాలోకి దిగుమతి కాకుండా నిషేధించబడిన ఒక రకమైన చేపల డేటాను తారుమారు చేసిన ఖాసిమ్ ప్రాంతంలోని ఒక సంస్థపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) SR500,000 జరిమానా విధించింది. సౌదీ అరేబియా వెలుపలి నుంచి దిగుమతి చేసుకున్న గిడ్డంగిలో ఎనిమిది రకాల చేపలు ఉన్న షిప్మెంట్ను తనిఖీ చేసిన తర్వాత పెనాల్టీ విధించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. తనిఖీ సందర్భంగా ఇన్స్పెక్టర్లు షిప్మెంట్లోని చేపల రకాల్లో ఒకదాని పేరుపై అనుమానాలు కలిగాయి. లేబుల్ మరియు కస్టమ్స్ డిక్లరేషన్లోని డేటా దిగుమతి చేసుకున్న చేపల స్పష్టమైన రూపానికి సరిపోలలేదు. నమూనాలు తీసుకొని చెక్ చేయగా, దిగుమతి చేసుకున్న రకాల్లో ఒకటి లేబుల్లో చేర్చబడిన వాటితో సరిపోలడం లేదని స్పష్టమైంది. ఇది నది తిలాపియా రకమని, దీని దిగుమతిని సౌదీ నిషేధించింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు SR500,000 జరిమానా విధించినట్టు వెల్లడించింది. ఏదైనా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలను గమనించినప్పుడు, 19999కి కాల్ చేయడం ద్వారా నివేదించాలని వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









