డ్రోన్ కారణంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లో అలజడి
- June 12, 2016
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓ డ్రోన్ కారణంగా ఒక గంటపాటు తాత్కాలికంగా మూసివేయబడింది. అనధికారిక ద్రోన్ ఒకటి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎయిర్స్పేస్లోకి రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. దాంతో 11.36 నిమిషాల నుంచి 12.45 నిమిషాల వరకు విమాన సేవల్ని ఈ ఎయిర్పోర్ట్లో తాత్కాలికంగా నిలిపివేశారు. సమీపంలోని ఎయిర్పోర్ట్లకు విమానాల్ని మళ్ళించారు. చాలా విమానాల వేళల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. అనధికారికంగా దూసుకొచ్చిన ఆ డ్రోన్కి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ యంత్రాంగం డ్రోన్ల వినియోగంపై వున్న నిబంధనల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే నిర్ణయానికి వచ్చింది. డ్రోన్ల వినియోగంపై కఠినమైన నిబంధనలున్నప్పటికీ ఒక్కోసారి అవగాహనా లోపంతో డ్రోన్ నిర్వాహకులు తప్పిదాలకు పాల్పడుతున్నారు. డ్రోన్ల ద్వారా ఎలాంటి డ్యామేజీకీ పాల్పడకూడదు. డ్రోన్ ఆపరేటర్ దాని కారణంగా జరిగే ఇబ్బందులకు చట్టబద్ధంగా బాధ్యుడవుతాడు. ఎయిర్పోర్ట్ లేదా ల్యాండింగ్ ఏరియా పరిధిలో సుమారు 5 కిలోమీటర్ల మేర డ్రోన్ల వినియోగం నేరం. డ్రోన్ వినియోగించేటప్పుడు అది పూర్తి కండిషన్లో ఉందో లేదో చూసుకోవాలి. డ్రోన్లకు కమెరాలను వినియోగించడంపై అధికారిక వర్గాల నుంచి పర్మిషన్ తప్పనిసరి. ఫొటోలు లేదా వీడియోలను చిత్రీకరించేటప్పుడు ఏ వ్యక్తి యొక్క ప్రైవసీకి భంగం వాటిల్లరాదు. వీటన్నిటినీ గుర్తుంచుకుని డ్రోన్ ఆపరేటర్లు వ్యవహరించాలి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







