సత్యం రాజేష్.! ‘పొలిమేర’తో దక్కించుకున్న పాపులారిటీ ఏమైంది.!
- July 01, 2024
‘సత్యం’ సినిమాతో కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న రాజేష్, ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘పొలిమేర’ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో హిట్టు మీద హిట్టు కొట్టాడు సత్యం రాజేష్.
తాజాగా సత్యం రాజేష్ నుంచి వచ్చిన చిత్రం ‘టెనెంట్’. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకి ఓటీటీలో భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ్.
‘చంద్రుడి మీదికెళ్లినా ఆడవాళ్లకు రక్షణ లేదు.. మీ భద్రత మీ బాధ్యత..’ అనే స్లోగన్తో సినిమాని ఎండ్ చేయడం ఏమంత కన్విన్సింగ్గా అనిపించడం లేదన్నది ఓటీటీ ప్రేక్షకుల అభిప్రాయం.
ఈ సినిమాలో లీడ్ రోల్స్ అన్నీ చనిపోతాయ్ సత్యం రాజేష్తో సహా. నిజానికి అలా చంపాల్సిన అవసరం లేదు. ఇంకాస్త స్పాన్తో ఈ సినిమాని నడిపించొచ్చు. కానీ, ఎందుకో తెలీదు, అన్ని క్యారెక్టర్స్నీ చంపేసి.. చివరికి పై స్లోగన్తో సినిమాని ఎండ్ చేసేశారు.
ఏం సందేశం ఇస్తున్నట్లు దీనితో. ఆకాశంలో సగం, అన్నింటా సగం.. అంటూ ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా దూసుకెళ్తున్న రోజులివి. ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగితే జరగొచ్చు గాక.! ఆ మాటకొస్తే.. ఆడవాళ్ల చేతుల్లో మోసపోతున్న మగవాళ్ల సంఖ్య ఎంత మేర బయటపడుతోంది.?
సినిమాలు సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంత మాత్రం యూజ్ కావని ఈ తరహా సినిమాలు చేసే, చేయాలనుకుంటున్న మేకర్లు తెలుసుకుంటే మంచిది.! అనేది సగటు ఓటీటీ ప్రేక్షకుడి అభిప్రాయం.
తాజా వార్తలు
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై







