సత్యం రాజేష్.! ‘పొలిమేర’తో దక్కించుకున్న పాపులారిటీ ఏమైంది.!
- July 01, 2024
‘సత్యం’ సినిమాతో కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న రాజేష్, ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘పొలిమేర’ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో హిట్టు మీద హిట్టు కొట్టాడు సత్యం రాజేష్.
తాజాగా సత్యం రాజేష్ నుంచి వచ్చిన చిత్రం ‘టెనెంట్’. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకి ఓటీటీలో భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ్.
‘చంద్రుడి మీదికెళ్లినా ఆడవాళ్లకు రక్షణ లేదు.. మీ భద్రత మీ బాధ్యత..’ అనే స్లోగన్తో సినిమాని ఎండ్ చేయడం ఏమంత కన్విన్సింగ్గా అనిపించడం లేదన్నది ఓటీటీ ప్రేక్షకుల అభిప్రాయం.
ఈ సినిమాలో లీడ్ రోల్స్ అన్నీ చనిపోతాయ్ సత్యం రాజేష్తో సహా. నిజానికి అలా చంపాల్సిన అవసరం లేదు. ఇంకాస్త స్పాన్తో ఈ సినిమాని నడిపించొచ్చు. కానీ, ఎందుకో తెలీదు, అన్ని క్యారెక్టర్స్నీ చంపేసి.. చివరికి పై స్లోగన్తో సినిమాని ఎండ్ చేసేశారు.
ఏం సందేశం ఇస్తున్నట్లు దీనితో. ఆకాశంలో సగం, అన్నింటా సగం.. అంటూ ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా దూసుకెళ్తున్న రోజులివి. ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగితే జరగొచ్చు గాక.! ఆ మాటకొస్తే.. ఆడవాళ్ల చేతుల్లో మోసపోతున్న మగవాళ్ల సంఖ్య ఎంత మేర బయటపడుతోంది.?
సినిమాలు సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంత మాత్రం యూజ్ కావని ఈ తరహా సినిమాలు చేసే, చేయాలనుకుంటున్న మేకర్లు తెలుసుకుంటే మంచిది.! అనేది సగటు ఓటీటీ ప్రేక్షకుడి అభిప్రాయం.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







