సత్యం రాజేష్.! ‘పొలిమేర’తో దక్కించుకున్న పాపులారిటీ ఏమైంది.!
- July 01, 2024
‘సత్యం’ సినిమాతో కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న రాజేష్, ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘పొలిమేర’ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో హిట్టు మీద హిట్టు కొట్టాడు సత్యం రాజేష్.
తాజాగా సత్యం రాజేష్ నుంచి వచ్చిన చిత్రం ‘టెనెంట్’. సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకి ఓటీటీలో భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ్.
‘చంద్రుడి మీదికెళ్లినా ఆడవాళ్లకు రక్షణ లేదు.. మీ భద్రత మీ బాధ్యత..’ అనే స్లోగన్తో సినిమాని ఎండ్ చేయడం ఏమంత కన్విన్సింగ్గా అనిపించడం లేదన్నది ఓటీటీ ప్రేక్షకుల అభిప్రాయం.
ఈ సినిమాలో లీడ్ రోల్స్ అన్నీ చనిపోతాయ్ సత్యం రాజేష్తో సహా. నిజానికి అలా చంపాల్సిన అవసరం లేదు. ఇంకాస్త స్పాన్తో ఈ సినిమాని నడిపించొచ్చు. కానీ, ఎందుకో తెలీదు, అన్ని క్యారెక్టర్స్నీ చంపేసి.. చివరికి పై స్లోగన్తో సినిమాని ఎండ్ చేసేశారు.
ఏం సందేశం ఇస్తున్నట్లు దీనితో. ఆకాశంలో సగం, అన్నింటా సగం.. అంటూ ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా దూసుకెళ్తున్న రోజులివి. ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగితే జరగొచ్చు గాక.! ఆ మాటకొస్తే.. ఆడవాళ్ల చేతుల్లో మోసపోతున్న మగవాళ్ల సంఖ్య ఎంత మేర బయటపడుతోంది.?
సినిమాలు సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంత మాత్రం యూజ్ కావని ఈ తరహా సినిమాలు చేసే, చేయాలనుకుంటున్న మేకర్లు తెలుసుకుంటే మంచిది.! అనేది సగటు ఓటీటీ ప్రేక్షకుడి అభిప్రాయం.
తాజా వార్తలు
- జీసీసీ, మిడిల్ ఈస్ట్ అంతటా 700 కి పైగా విమానాలు రద్దు..!!
- ఒమన్లో వరుస దాడులు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు









