అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- July 02, 2024
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరీ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల పై సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు.
మచిలీపట్నం పోర్ట్ లో రిఫైనరీ పెట్టాలని, మచిలీపట్నం–రేపల్లే మధ్య రైల్వే లైన్ ఏర్పాలు చేయాలని, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేయడంతోపాటు గ్రీన్ ఎనర్జీని అందజేసే ప్రాజెక్టులను ప్రోత్సాహించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలోని కౌలు రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అందజేయాలని ప్రత్యేకంగా ప్రధాని మోదీని ఎంపీ బాలశౌరీ కోరారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







