అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- July 02, 2024
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరీ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల పై సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు.
మచిలీపట్నం పోర్ట్ లో రిఫైనరీ పెట్టాలని, మచిలీపట్నం–రేపల్లే మధ్య రైల్వే లైన్ ఏర్పాలు చేయాలని, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేయడంతోపాటు గ్రీన్ ఎనర్జీని అందజేసే ప్రాజెక్టులను ప్రోత్సాహించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలోని కౌలు రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అందజేయాలని ప్రత్యేకంగా ప్రధాని మోదీని ఎంపీ బాలశౌరీ కోరారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







