ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెట్లో తనిఖీలు
- June 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, అబుదాబీలో గల పోర్ట్ జాయెద్ ఏరియాలోని మార్కెట్లో తనిఖీలు నిర్వహించింది. మినిస్ట్రీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నౌమి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. షాప్ కీపర్స్తో ఈ సందర్భంగా మాట్లాడిన హషీమ్ అల్ నౌమి, మార్కెట్ స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే మినిస్ట్రీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ని సంప్రదించి, ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మినిస్ట్రీ సూచన మేరకు అన్ని షాప్లు మినిస్ట్రీ ఆమోదించిన లేబుల్స్ని ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ధరల పెరుగుదల తగ్గుదలపై ఎప్పటికప్పుడు మినిస్ట్రీ అన్ని విషయాల్నీ పరిశీలిస్తోందని, మార్కెట్ స్థితిగతుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఎలాంటి పరిస్థితులూ ఇక్కడ కన్పించలేదని అల్ నౌమి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









