నిబంధనల ఉల్లంఘనకు సిసిటివితో చెక్
- June 13, 2016
సరికొత్త సిసిటివి ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్కి అధికారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించడానికి వీలవుతుందని, అలాగే ప్రమాదాల్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ని నియంత్రించడం జరుగుతోందని అధికారులు తెలిపారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - ట్రాఫిక్ కల్చర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహర్ మాట్లాడుతూ, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆర్డినరీ సీసీటివి కెమెరాలతో పోల్చితే తాజా టెక్నాలజీ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. కొత్త విధానం ద్వారా ముందే ట్రాఫిక్ని అంచనా వేయడానికి వీలువుతుందని తెలిపారాయన. కొత్త టెక్నాలజీతో వాహనాల వేగాన్ని గుర్తించడం, అలాగే రోడ్లపై ట్రాఫిక్ని అంచనా వేయడం, సిగ్నల్ క్రాసింగ్, రాంగ్ ఓవర్టేకింగ్, ఎల్లో బాక్స్, ఎమర్జన్సీ లేన్స్లో డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించవచ్చు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







