ఫ్రూట్స్, వెజిటబుల్ మార్కెట్లో తనిఖీలు
- June 13, 2016
మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ, అబుదాబీలో గల పోర్ట్ జాయెద్ ఏరియాలోని మార్కెట్లో తనిఖీలు నిర్వహించింది. మినిస్ట్రీ కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ హషీమ్ అల్ నౌమి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్తో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు. షాప్ కీపర్స్తో ఈ సందర్భంగా మాట్లాడిన హషీమ్ అల్ నౌమి, మార్కెట్ స్థితిగతుల్ని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలుంటే మినిస్ట్రీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ని సంప్రదించి, ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. మినిస్ట్రీ సూచన మేరకు అన్ని షాప్లు మినిస్ట్రీ ఆమోదించిన లేబుల్స్ని ప్రదర్శించాల్సి ఉంటుందని తెలిపారు. ధరల పెరుగుదల తగ్గుదలపై ఎప్పటికప్పుడు మినిస్ట్రీ అన్ని విషయాల్నీ పరిశీలిస్తోందని, మార్కెట్ స్థితిగతుల్ని బట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లుగా ఎలాంటి పరిస్థితులూ ఇక్కడ కన్పించలేదని అల్ నౌమి తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







