ఎయిర్ ఆసియా వారి 'బిగ్ సేల్'
- June 13, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియా రెండో వార్షికోత్సవం సందర్భంగా 'బిగ్ సేల్' పేరుతో తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. అన్ని రుసుములతో కలిసి దేశీయంగా టిక్కెట్ ప్రారంభ ధర రూ.799గా ప్రకటించింది. 2017 జనవరి4 నుంచి 2017 ఆగస్టు 21లోపు ప్రయాణించాలనుకునే వారు ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సేల్ కింద ఈ నెల 19 వరకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ ఆఫర్ కింద పలు రూట్లలో విమాన టిక్కెట్ల ధరల్ని ఎయిర్ ఏషియా ఇండియా తన వెబ్సైట్లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం...
* గువాహటి-ఇంఫాల్ : రూ.799 * బెంగళూరు-కొచ్చి : రూ.899 * బెంగళూరు-పూనె : రూ.1,099 * దిల్లీ-బెంగళూరు : రూ.2,699 * విశాఖపట్నం-బెంగళూరు : రూ..1,199 అంతర్జాతీయంగా కొన్ని రూట్లకూ ఈ ఆఫర్ కింద తగ్గింపు ఛార్జీల్ని సంస్థ ప్రకటించింది. ఆఫర్లో టిక్కెట్ ప్రారంభ ధర రూ.3,399. కొచ్చి-కౌలాలంపూర్ టిక్కెట్ ధర రూ.3,399.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







