ఎయిర్ ఆసియా వారి 'బిగ్ సేల్'

- June 13, 2016 , by Maagulf
ఎయిర్ ఆసియా వారి 'బిగ్ సేల్'

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా ఇండియా రెండో వార్షికోత్సవం సందర్భంగా 'బిగ్‌ సేల్‌' పేరుతో తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. అన్ని రుసుములతో కలిసి దేశీయంగా టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.799గా ప్రకటించింది. 2017 జనవరి4 నుంచి 2017 ఆగస్టు 21లోపు ప్రయాణించాలనుకునే వారు ఈ ఆఫర్‌ కింద టిక్కెట్‌లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ సేల్‌ కింద ఈ నెల 19 వరకు టిక్కెట్‌లు బుక్‌ చేసుకోవచ్చని చెప్పింది. ఈ ఆఫర్‌ కింద పలు రూట్లలో విమాన టిక్కెట్‌ల ధరల్ని ఎయిర్‌ ఏషియా ఇండియా తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... 

* గువాహటి-ఇంఫాల్‌ : రూ.799 * బెంగళూరు-కొచ్చి : రూ.899 * బెంగళూరు-పూనె : రూ.1,099 * దిల్లీ-బెంగళూరు : రూ.2,699 * విశాఖపట్నం-బెంగళూరు : రూ..1,199 అంతర్జాతీయంగా కొన్ని రూట్లకూ ఈ ఆఫర్‌ కింద తగ్గింపు ఛార్జీల్ని సంస్థ ప్రకటించింది. ఆఫర్‌లో టిక్కెట్‌ ప్రారంభ ధర రూ.3,399. కొచ్చి-కౌలాలంపూర్‌ టిక్కెట్‌ ధర రూ.3,399.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com