వైఎస్సార్ లాంటి సీఎం భూతద్దంలో వెతికినా కనిపించరు: షర్మిల
- July 09, 2024
మంగళగరి: మంగళగరిలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు.వైఎస్ఆర్ బీజేపీకి బద్ధ వ్యతిరేకి అన్న షర్మిల.. వైఎస్సార్ వారసులం అని చెబుతున్న వారు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. ప్రజల కోసం ప్రతిక్షణం పరితపించిన సీఎం వైఎస్సార్ అని షర్మిల అన్నారు. దేవుడి దయతో ఇంత మంచిని ప్రజల కోసం చేసే అవకాశం కలిగిందని వైఎస్సార్ చివరి రోజుల్లో చెప్పారని ఆమె గుర్తు చేసుకున్నారు.
అధికారం.. అనుభవించటం కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాత్రమేనని వైఎస్సార్ నమ్మారని షర్మిల వెల్లడించారు. గెలిచిన వెంటనే ఐదేళ్ల సమయం ఉన్నా.. ప్రజల కోసం వెళ్లి వైఎస్ఆర్ మనకి దూరమయ్యారు అని షర్మిల ఎమోషన్ అయ్యారు.
”వైఎస్సార్ లాంటి సీఎం మనకి భూతద్దంలో వెతికినా కనిపించరు. రెండోసారి గెలిచినప్పుడు మెజార్టీ తగ్గటంతో ప్రజలు అంతగా మీ అంతగా మిమ్మల్ని ప్రేమించలేదు అంటే నవ్వి ఊరుకున్నారు. వైఎస్సార్ చనిపోయిన రోజే ఆయనపై ప్రజలకున్న ప్రేమ ఎంతో అర్థమైంది. రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయితే దేశానికి మంచిదని ఎప్పుడో గుర్తించారు వైఎస్సార్. రాహుల్ ని దేశ ప్రధాని చేయాలనేది వైఎస్సార్ ఆఖరి కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది” అని షర్మిల అన్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాద బాధితులకు Dh1 మిలియన్ సాయం ప్రకటించిన యూఏఈ బిలియనీర్
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్









