కువైట్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాసులు మృతి..మృతుల్లో భారతీయులు
- July 10, 2024
కువైట్: మంగళవారం తెల్లవారుజామున ఏడవ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు సహా ఏడుగురు ప్రవాసులు మరణించారు. అధికారుల కథనం ప్రకారం.. వారు తమ పని స్థలం నుండి మినీ వ్యాన్లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ను మరొక వాహనం ఢీకొనడంతో వ్యాన్ నియంత్రణ కోల్పోయి అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులో వంతెన డివైడర్ను ఢీకొట్టింది. దుర్ఘటనలో మరణించిన భారతీయులను బిహారీ లాల్, బక్కర్ సింగ్, బిక్రమ్ సింగ్, దేవేందర్ సింగ్ మరియు రాజ్ కుమార్ కృష్ణస్వామిగా గుర్తించారు. సురేంద్రన్, బిను మనోహరన్, గురుచరణ్ సింగ్ సహా ముగ్గురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్







