కువైట్లో రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ప్రవాసులు మృతి..మృతుల్లో భారతీయులు
- July 10, 2024
కువైట్: మంగళవారం తెల్లవారుజామున ఏడవ రింగ్ రోడ్డులో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశీయులు సహా ఏడుగురు ప్రవాసులు మరణించారు. అధికారుల కథనం ప్రకారం.. వారు తమ పని స్థలం నుండి మినీ వ్యాన్లో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ను మరొక వాహనం ఢీకొనడంతో వ్యాన్ నియంత్రణ కోల్పోయి అబ్దుల్లా అల్ ముబారక్ ప్రాంతానికి ఎదురుగా ఉన్న ఏడవ రింగ్ రోడ్డులో వంతెన డివైడర్ను ఢీకొట్టింది. దుర్ఘటనలో మరణించిన భారతీయులను బిహారీ లాల్, బక్కర్ సింగ్, బిక్రమ్ సింగ్, దేవేందర్ సింగ్ మరియు రాజ్ కుమార్ కృష్ణస్వామిగా గుర్తించారు. సురేంద్రన్, బిను మనోహరన్, గురుచరణ్ సింగ్ సహా ముగ్గురు భారతీయులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







