ఔట్ డోర్ కార్మికులకు ఊరట
- June 14, 2016
ఖతార్ వ్యాప్తంగా ఔట్ డోర్లో పనిచేసే కార్మికుల కోసం పని వేళల్లో మార్పులు చేయనున్నారు. జూన్ 15 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. సుమారు 75 రోజులపాటు ఔట్ డోర్లో పనిచేసే కార్మికులకు ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పని చేయకుండా వెసులుబాటు కల్పిస్తారు. ఈ మేరకు మినిస్టీరియల్ ఇన్స్ట్రక్షన్స్ స్పష్టంగా ఉన్నాయి. నిబంధనల్ని ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇదిలా ఉండగా, మినిస్ట్రీ ఇన్స్ట్రక్షన్స్ రాకుండానే కొన్ని సంస్థలు ఇప్పటికే ఈ టైమింగ్స్ని అమల్లోకి తెచ్చాయి. పగటి ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిన ప్రస్తుత పరిస్థితుల్లో డైరెక్ట్ సన్ లైట్లో పని చేయడం కార్మికులకు చాలా ఇబ్బందికరంగా మారుతోంది. ఉదయం 11 గంటలకే ఉద్యోగులకు విరామం ప్రకటిస్తున్నాయి కొన్ని సంస్థలు. మధ్యాహ్న వేళల్లో పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని, ఔట్ డోర్ పనిని వాతావరణం చల్లబడిన తర్వాత, రాత్రి వేళల్లో ఎక్కువగా చేపడుతున్నాయ పలు సంస్థలు.
తాజా వార్తలు
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!









