తెలుగు ఆడియన్స్కి ఎస్. జె సూర్య విలనిజం.!
- July 10, 2024
రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన ఎస్.జె.సూర్యకు తెలుగులోనూ వీరాభిమానులున్నారు. ఆయన తెరకెక్కించిన ‘ఖుషి’ మూవీ ఎవర్ గ్రీన్ సినిమా తెలుగులో. అలాగే ఆయన పోషించిన పలు పాత్రలు కూడా తెలుగులో పాపులరే.
ఇక, ఇప్పుడు ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కానున్నారు. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ చిత్రంలో నటించారాయన. ఈ నెలలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో మెయిన్ విలన్గా నటిస్తున్నారు.
విలక్షణ నటుడైన ఎస్.జె.సూర్య నటన, రామ్ చరణ్కి పోటీగా ఈ సినిమాలో ఏ రేంజ్లో వుండబోతోందో ఊహించడానికే కష్టం అనేలా వుండబోతోందట. శంకర్ దర్శకత్వంలో రూపొందిన పాత్ర కదా. అది వేరే లెవలే వుంటుంది.
ఇక, నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ సినిమాలోనూ ఎస్.జె.సూర్య ఓ డిఫరెంట్ విలనిజం చూపించబోతున్నారట. ఆల్రెడీ మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలో ఆయన కరడు కట్టిన విలనిజం ప్రదర్శించి మెస్మరైజ్ చేశారు.
ఇక, ఇప్పుడు రాబోయే తెలుగు సినిమాల్లో ఆయన విలనిజానికి స్పెషల్గా మరింత స్పెషల్గా ఫ్యాన్ బేస్ క్రియేట్ కావడం పక్కా అన్నమాటే.!
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







