చేపలు తింటే గుండె సమస్యలు దూరంగా వుంటాయా.?
- July 10, 2024
నాన్వెజ్ తినేవారికి చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపల కూర, పులుసు, ఫ్రై.. ఇలా అనేక రకాలుగా వండి తినే నాన్ వెజ్ వంటకం చేప. అయితే, చేపలను తినడం వల్ల కలిగే లాభాలేంటీ.?
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుంటాయ్. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయ్.అనవసరమైన కొవ్వు కణాలు పెరగకుండా చేస్తాయ్. అంటే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులు రాకుండా వుండాలంటే ఖచ్చితంగా చేపలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాదు, చేపల్లో మెగ్నీషియం అధికంగా వుంటుంది. ఇది శరీరానికి సరిపడా లేకపోతే, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అదేంటీ.? మెగ్నీషియానికి కాల్షియానికి సంబంధం ఏంటంటారా.? శరీరంలోని కాల్షియం మెటబాలిజాన్ని సమతుల్యం చేయడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. తద్వారా సరిపడా మెగ్నీషియం వుంటేనే కాల్షియం లెవల్ కూడా బాగుంటుంది.
చేపలు తరచూ తినేవారిలో కీళ్ల నొప్పుల సమస్యలు కూడా తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని అధిక ఉస్ణోగ్రతని తగ్గించడానికి కడుపులో మంట, అల్జీమర్స్, డిప్రెషన్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా చేపలు ఎక్కువగా తినేవారిలో తక్కువ అని తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







