చేపలు తింటే గుండె సమస్యలు దూరంగా వుంటాయా.?
- July 10, 2024
నాన్వెజ్ తినేవారికి చాలా మందికి చేపలు అంటే చాలా ఇష్టం. చేపల కూర, పులుసు, ఫ్రై.. ఇలా అనేక రకాలుగా వండి తినే నాన్ వెజ్ వంటకం చేప. అయితే, చేపలను తినడం వల్ల కలిగే లాభాలేంటీ.?
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా వుంటాయ్. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయ్.అనవసరమైన కొవ్వు కణాలు పెరగకుండా చేస్తాయ్. అంటే క్యాన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధులు రాకుండా వుండాలంటే ఖచ్చితంగా చేపలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాదు, చేపల్లో మెగ్నీషియం అధికంగా వుంటుంది. ఇది శరీరానికి సరిపడా లేకపోతే, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. అదేంటీ.? మెగ్నీషియానికి కాల్షియానికి సంబంధం ఏంటంటారా.? శరీరంలోని కాల్షియం మెటబాలిజాన్ని సమతుల్యం చేయడానికి మెగ్నీషియం ఉపయోగపడుతుంది. తద్వారా సరిపడా మెగ్నీషియం వుంటేనే కాల్షియం లెవల్ కూడా బాగుంటుంది.
చేపలు తరచూ తినేవారిలో కీళ్ల నొప్పుల సమస్యలు కూడా తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలోని అధిక ఉస్ణోగ్రతని తగ్గించడానికి కడుపులో మంట, అల్జీమర్స్, డిప్రెషన్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా చేపలు ఎక్కువగా తినేవారిలో తక్కువ అని తాజా సర్వేలో తేలింది.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









