భోగాపురం విమానాశ్రయం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- July 11, 2024
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ గ్రోత్ ఇంజిన్ లా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో పోర్టులు కూడా ఉన్నాయని, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అంతా కలిసిపోతుందని చెప్పారు. శ్రీకాకుళం నుండి వైజాగ్ వరకు బీచ్ హైవే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 31.8 శాతం ఎయిర్ పోర్ట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 45 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారని అంచనా వేశారు. రోడ్ల కనెక్టివిటీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
జిల్లా పర్యటన కోసం హెలికాప్టర్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. అంతకుముందు ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేశారు. జీఎంఆర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో విమానాశ్రయ నిర్మాణ పనులపై ప్రజంటేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
--సాగర్(మాగల్ఫ్ ప్రతినిధి,అమరావతి)
తాజా వార్తలు
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య









