భోగాపురం విమానాశ్రయం పై సీఎం చంద్రబాబు సమీక్ష
- July 11, 2024
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం ఎయిర్ పోర్ట్ గ్రోత్ ఇంజిన్ లా ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్రలో పోర్టులు కూడా ఉన్నాయని, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్ర అంతా కలిసిపోతుందని చెప్పారు. శ్రీకాకుళం నుండి వైజాగ్ వరకు బీచ్ హైవే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటివరకు 31.8 శాతం ఎయిర్ పోర్ట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. 45 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు చేస్తారని అంచనా వేశారు. రోడ్ల కనెక్టివిటీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యూజర్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీతో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుగుతుందన్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
జిల్లా పర్యటన కోసం హెలికాప్టర్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు సీఎం చంద్రబాబు. అంతకుముందు ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై హెలికాప్టర్ లో ఏరియల్ వ్యూ ద్వారా సర్వే చేశారు. జీఎంఆర్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో విమానాశ్రయ నిర్మాణ పనులపై ప్రజంటేషన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
--సాగర్(మాగల్ఫ్ ప్రతినిధి,అమరావతి)
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







