ఆగస్టు 2న విడుదల కానున్న ‘ఉషా పరిణయం’
- July 13, 2024
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన కె. విజయ్ భాస్కర్ స్వీయ దర్శకత్వంలో మరో సరికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ రాబోతోంది.ఉషా పరిణయం అనే టైటిల్తో ఫ్యామిలి ఎంటర్టైనర్ను విడుదలకు సిద్దం చేశారు. ఈ చిత్రాన్ని విజయభాస్కర్ క్రాఫ్ట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. విజయ్ భాస్కర్ తన తనయుడు శ్రీకమల్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథానాయికగా తాన్వి ఆకాంక్ష అనే తెలుగమ్మాయి పరిచయం కాబోతోంది. ఆగస్టు 2న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ’సరికొత్త ప్రేమ కథతో అన్నీ ఎమోషన్స్ తో ఉండే మంచి లవ్ స్టోరీ ఇది. సినిమా లవర్స్కు ఇదొక విందు భోజనంలా ఉంటుంది”అని అన్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







