ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ నియామకం
- July 13, 2024
అమరావతి: ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనాకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ముకేశ్ కుమార్ మీనా నిన్న సాయంత్రం ఏపీ సీఈవో బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు.ఆ స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముకేశ్ కుమార్ మీనా అక్రమాలను అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేశారన్న ప్రశంసలు అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయనను ఈ బాధ్యతల్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆయన స్థానంలో కొత్త సీఈవోగా నియమితులైన వివేక్ యాదవ్ మొన్నటి వరకు సీఆర్డీయే కమిషనర్గా పనిచేశారు. రెండు రోజుల క్రితం యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అంతలోనే ఆయనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మరోవైపు, ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక అధికారులతోపాటు భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గురువారంనాడు కూడా పలువురు అధికారులను ఏపీ సర్కారు బదిలీ చేసింది. ఏపీలో గురువారం 19 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అనంతరామును అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్.పి. సిసోడియాకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







