అకౌంట్లో డబ్బులు లేకున్నా యూపీఐ పేమెంట్స్
- July 13, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో యూపీఐ చెల్లింపుల విధానం వేగంగా వృద్ధి చెందుతోంది. ఇప్పటి వరకు బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఉంటేనే యూపీఐ చెల్లింపులు చేసేందుకు వీలు ఉండేది. అయితే త్వరలో డబ్బులు లేకున్నా చెల్లింపులు చేయటానికి అవకాశం రాబోతోంది. రానున్న రోజుల్లో యూజర్లు తమ బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకపోయినా సులభంగా యుపీఐ చెల్లింపులు చేయగలుగుతారు. యూపీఐ ఉపయోగించే కస్టమర్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలో క్రెడిట్ లైన్ సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది. వాస్తవానికి యూపీఐపై క్రెడిట్ లైన్ 9 నెలల క్రితమే ప్రకటించారు. ఈ సదుపాయం ప్రారంభించిన తర్వాత వినియోగదారుల యూపీఐ ఖాతా క్రెడిట్ కార్డ్ లాగా పని చేస్తుంది. వాస్తవానికి యూపీఐపై క్రెడిట్ లైన్ అనేది బ్యాంక్ ఖాతాను ఉపయోగించే కస్టమర్ కు ముందస్తుగా ఓకే చేయబడిన రుణం. ప్రతి కస్టమర్ తన సిబిల్ స్కోర్ ప్రకారం క్రెడిట్ లైన్ పొందుతారని కార్పొరేషన్ చెబుతోంది. దీని ద్వారా బిజినెస్ ఖాతాలకు మాత్రమే చెల్లింపులు చేయగలుగుతారు. ఈ క్రెడిట్ లైన్ వినియోగించుకున్నందుకు బ్యాంకులు వడ్డీని వసూలు చేస్తాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లు పేమెంట్ కార్పొరేషన్ లో చేరడానికి ఓకే చెప్పాయి.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









