300 దిర్హామ్ల జరిమానా..640 ఈ-స్కూటర్లు సీజ్
- July 14, 2024
దుబాయ్: ఈ నెలలో దుబాయ్ పోలీసులు 640 సైకిళ్లు, ఈ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓవర్స్పీడ్, నిర్దేశించని ప్రాంతాలలో రైడింగ్, ట్రాఫిక్కు వ్యతిరేకంగా రైడింగ్, సేఫ్టీ గేర్ మరియు హెల్మెట్ ధరించకుండా ఉండటం వంటి వివిధ ఉల్లంఘనలను నమోదు చేసినట్టు మేజర్ జనరల్ అబ్దుల్లా అలీ అల్ ఘైతీ వెల్లడించారు. ఇ-స్కూటర్లు 60కిమీ కంటే ఎక్కువ వేగ పరిమితితో నడపడం చేస్తే 300 దిర్హామ్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఇతరులకు ప్రమాదం కలిగించే బైక్ను నడపడానికి300 దిర్హామ్లు, ఈ-స్కూటర్పై ప్రయాణీకులను తీసుకెళ్లడం 300 దిర్హామ్లు, ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇ-స్కూటర్ లేదా సైకిల్ తొక్కడం చేస్తే 200 దిర్హామ్ జరిమానా ఉంటుందని గుర్తుచేశారు. దుబాయ్ పోలీస్ యాప్లోని 'పోలీస్ ఐ' సేవ ద్వారా లేదా 901లో 'వి ఆర్ ఆల్ పోలీస్' సేవకు కాల్ చేయడం ద్వారా రోడ్డుపై ఏవైనా ప్రమాదకరమైన ప్రవర్తనలు ఉంటే తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
2024 ప్రథమార్థంలో ఇ-స్కూటర్లు, సైకిళ్లతో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మరణించారని, 25మంది గాయపడ్డారని దుబాయ్ పోలీసులు చెప్పారు. 2024 మొదటి ఆరు నెలల్లో 7,800 కంటే ఎక్కువ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కాగా, అధికారులు 4,474 ఇ-స్కూటర్లు మరియు సైకిళ్లను సీజ్ చేశారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









