పాకిస్థాన్లో అత్యవసరంగా ల్యాండైన దుబాయ్ విమానం..మహిళ మృతి
- July 14, 2024
యూఏఈ: దుబాయ్ నుంచి కొలంబో వెళ్లే ఫ్లైదుబాయ్ విమానం బుధవారం కరాచీలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఎయిర్లైన్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. “జులై 10న దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) నుండి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సిఎమ్బి)కి ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్జెడ్ 569 వైద్యపరమైన కారణాల వల్ల కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (కెహెచ్ఐ) మళ్లించారు. మొత్తం ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం తిరిగి ప్రారంభమైంది." అని ప్రతినిధి తెలిపారు. కలిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసారు. మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఫ్లైదుబాయ్ మరిన్ని వివరాలు అందివ్వలేదు.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి సైఫుల్లా ఖాన్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలంక మహిళ గురించి వైద్య అత్యవసర పరిస్థితిని తెలిపారు. ఎఫ్జెడ్ ఫ్లైట్ 569 దుబాయ్ నుండి కొలంబోకు వెళ్తోందని, విమానం కరాచీలో రాత్రి 11 గంటలకు ల్యాండ్ అయిందని ఖాన్ చెప్పారు. ఆమె మృతదేహాన్ని మాలిర్లోని ఖిద్మత్-ఎ-ఖల్క్ ఫౌండేషన్కు పంపారని, అనంతరం ఫ్లైదుబాయ్ విమానం తెల్లవారుజామున 3 గంటలకు [గురువారం] బయలుదేరింది. మహిళ బాడీని మరొక విమానంలో శ్రీలంకకు తరలించారు. ”అని ఖాన్ తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







