పాకిస్థాన్లో అత్యవసరంగా ల్యాండైన దుబాయ్ విమానం..మహిళ మృతి
- July 14, 2024
యూఏఈ: దుబాయ్ నుంచి కొలంబో వెళ్లే ఫ్లైదుబాయ్ విమానం బుధవారం కరాచీలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఎయిర్లైన్ ప్రతినిధి ధృవీకరించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. “జులై 10న దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్బి) నుండి కొలంబో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (సిఎమ్బి)కి ఫ్లైదుబాయ్ ఫ్లైట్ ఎఫ్జెడ్ 569 వైద్యపరమైన కారణాల వల్ల కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (కెహెచ్ఐ) మళ్లించారు. మొత్తం ఎనిమిది గంటల ఆలస్యంతో ప్రయాణం తిరిగి ప్రారంభమైంది." అని ప్రతినిధి తెలిపారు. కలిగిన అసౌకర్యానికి ప్రయాణికులకు క్షమాపణలు తెలియజేసారు. మెడికల్ ఎమర్జెన్సీ గురించి ఫ్లైదుబాయ్ మరిన్ని వివరాలు అందివ్వలేదు.
ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ప్రతినిధి సైఫుల్లా ఖాన్ మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీలంక మహిళ గురించి వైద్య అత్యవసర పరిస్థితిని తెలిపారు. ఎఫ్జెడ్ ఫ్లైట్ 569 దుబాయ్ నుండి కొలంబోకు వెళ్తోందని, విమానం కరాచీలో రాత్రి 11 గంటలకు ల్యాండ్ అయిందని ఖాన్ చెప్పారు. ఆమె మృతదేహాన్ని మాలిర్లోని ఖిద్మత్-ఎ-ఖల్క్ ఫౌండేషన్కు పంపారని, అనంతరం ఫ్లైదుబాయ్ విమానం తెల్లవారుజామున 3 గంటలకు [గురువారం] బయలుదేరింది. మహిళ బాడీని మరొక విమానంలో శ్రీలంకకు తరలించారు. ”అని ఖాన్ తెలిపారు.
తాజా వార్తలు
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!
- అమరావతికి చట్టబద్ధత: సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్ఆర్ఐ టీడీపీ సంబరాలు
- కువైట్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సముదాయం పై డ్రోన్ దాడి
- తెలంగాణ ప్రజలకు అలెర్ట్..
- ఏపీ హై కోర్ట్: విదేశాలకు వెళ్లిన అర్చకులు గర్భగుడిలోకి వెళ్లకూడదు
- ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్









