వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్..
- July 14, 2024
వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. జకోవిచ్ను 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లను అల్కరాజ్ తేలికగానే గెలిచాడు. మూడో సెట్లో మాత్రం జకోవిచ్ తో పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్ 6-6తో సమం అయింది.
దీంతో ట్రై బ్రేకర్కు వెళ్లడంతో మరోసారి ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. అల్కరాజ్ను కట్టడి చేసేందుకు జకోవిచ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రై బ్రేకర్లో జకోవిచ్ ను అల్కరాజ్ 7-4తో ఓడించాడు. అల్కరాజ్ వింబుల్డన్ విజేతగా నిలవడం ఇది వరుసగా రెండోసారి. జకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. 25వ గ్రాండ్స్లామ్ గెలవాలన్న కల నెరవేరలేదు.
వింబుల్డన్లో ఫైనల్ పోరును ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వీక్షించారు. ఫైనల్లో అల్కరాజ్, జకోవిచ్ పోరు ఉత్కంఠ భరితంగా ఉంటుందని ముందే ఊహించారు. టెన్నిస్ అభిమానులు కోరుకున్న ఆ ఫైట్ నిజంగానే అంతే ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్ టికెట్లు కూడా క్రీడా చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక రేట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









