వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేతగా కార్లోస్ అల్కరాజ్..
- July 14, 2024
వింబుల్డన్ 2024 పురుషుల సింగిల్స్ విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. జకోవిచ్ను 6-2, 6-2, 7-6 (7-4) తేడాతో ఓడించాడు. మొదటి రెండు సెట్లను అల్కరాజ్ తేలికగానే గెలిచాడు. మూడో సెట్లో మాత్రం జకోవిచ్ తో పోరాడాల్సి వచ్చింది. మూడో సెట్ 6-6తో సమం అయింది.
దీంతో ట్రై బ్రేకర్కు వెళ్లడంతో మరోసారి ఇద్దరూ రెచ్చిపోయి ఆడారు. అల్కరాజ్ను కట్టడి చేసేందుకు జకోవిచ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రై బ్రేకర్లో జకోవిచ్ ను అల్కరాజ్ 7-4తో ఓడించాడు. అల్కరాజ్ వింబుల్డన్ విజేతగా నిలవడం ఇది వరుసగా రెండోసారి. జకోవిచ్ ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు. 25వ గ్రాండ్స్లామ్ గెలవాలన్న కల నెరవేరలేదు.
వింబుల్డన్లో ఫైనల్ పోరును ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వీక్షించారు. ఫైనల్లో అల్కరాజ్, జకోవిచ్ పోరు ఉత్కంఠ భరితంగా ఉంటుందని ముందే ఊహించారు. టెన్నిస్ అభిమానులు కోరుకున్న ఆ ఫైట్ నిజంగానే అంతే ఉత్కంఠగా కొనసాగింది. ఈ మ్యాచ్ టికెట్లు కూడా క్రీడా చరిత్రలో ఎన్నడూ లేనంత అధిక రేట్లకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







