అంబానీ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ యువకుల పై కేసు..
- July 14, 2024
ముంబై: ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్తో అట్టహాసంగా శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి ఎందరో అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై దీవెనలు అందించారు. జియో వరల్డ్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో అనంత్ అంబానీ.. ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.
ఈరోజు తో ఈ పెళ్లి వేడుకలు పూర్తి అయ్యాయి. అయితే ఈ పెళ్లికి వెళ్లిన ఇద్దరు ఏపీ వ్యక్తులపై కేసు నమోదు అయ్యింది. అల్లూరి వెంకటేశ్ అనే యూట్యూబర్ తో పాటు మరో యువకుడి పేరు షఫీ షేక్ లకు పెళ్లి ఆహ్వానం లేకపోయినా వెళ్లడం తో పోలీసులు కేసు నమోదు చేసారు. వారిద్దరిపై వేర్వేరుగా కేసులు నమోదు చేసుకున్న ముంబయి బీకేసీ పోలీసులు… ఆ ఏపీ యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, నోటీసులు ఇచ్చి వదిలేశారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







