సౌదీ అరేబియాలో ఇంజినీరింగ్ ట్రేడ్ లో 25% జాతీయీకరణ..!
- July 21, 2024
రియాద్: సౌదీ అరేబియా ఆదివారం నుండి 25% ఇంజనీరింగ్ వృత్తులను జాతీయం చేయాలనే నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఈ వృత్తుల్లో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు కొత్త నిబంధన వర్తిస్తుంది. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు హౌసింగ్ భాగస్వామ్యంతో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యంలోని వివిధ ప్రాంతాలలో సౌదీ పౌరులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు మంత్రిత్వ శాఖలు చేస్తున్న ప్రయత్నాలలో ఈ చర్య భాగంమని భావిస్తున్నారు. మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ లేబర్ మార్కెట్లో భాగస్వామ్యాన్ని పెంచే నిర్ణయాన్ని పర్యవేక్షిస్తుంది. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో జాతీయీకరణ ప్రక్రియ, వృత్తులు మరియు అవసరమైన శాతాలను వివరించే విధానపరమైన గైడ్ను విడుదల చేసింది. పాటించని చట్టపరమైన జరిమానాలను విడించనున్నట్లు హెచ్చరించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







