ఖాన్ యూనిస్పై దాడిలో 89 మంది మృతి
- July 23, 2024
గాజా: దక్షిణ గాజాలోని తూర్పు ఖాన్ యూనిస్పై ఇజ్రాయిల్ మెరుపుదాడిలో 89 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది.
వందలాది మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాలని ఆదేశించిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్ వైమానిక దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్ అధికారులతో సమన్వయంతో గాజా నగరానికి ప్రయాణిస్తున్న స్పష్టంగా గుర్తించిన యుఎన్ కాన్వాయ్పై ఇజ్రాయిల్ సైన్యం దాడి జరిపింది. ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించాల్సిందిగా యుఎన్ఆర్డబ్ల్యుఎ చీఫ్ ఫిలిప్పె లాజారియా పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడిలో సుమారు 39,006 మంది పాలస్తీనియన్లు మరణించగా, 89,818 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







