ఖాన్ యూనిస్పై దాడిలో 89 మంది మృతి
- July 23, 2024
గాజా: దక్షిణ గాజాలోని తూర్పు ఖాన్ యూనిస్పై ఇజ్రాయిల్ మెరుపుదాడిలో 89 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది.
వందలాది మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాలని ఆదేశించిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్ వైమానిక దాడికి దిగిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయిల్ అధికారులతో సమన్వయంతో గాజా నగరానికి ప్రయాణిస్తున్న స్పష్టంగా గుర్తించిన యుఎన్ కాన్వాయ్పై ఇజ్రాయిల్ సైన్యం దాడి జరిపింది. ఈ దాడికి ఇజ్రాయిల్ బాధ్యత వహించాల్సిందిగా యుఎన్ఆర్డబ్ల్యుఎ చీఫ్ ఫిలిప్పె లాజారియా పిలుపునిచ్చారు.
ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడిలో సుమారు 39,006 మంది పాలస్తీనియన్లు మరణించగా, 89,818 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









