ఖాన్‌ యూనిస్‌పై దాడిలో 89 మంది మృతి

- July 23, 2024 , by Maagulf
ఖాన్‌ యూనిస్‌పై దాడిలో 89 మంది మృతి

గాజా: దక్షిణ గాజాలోని తూర్పు ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయిల్‌ మెరుపుదాడిలో 89 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా అధికారిక మీడియా కార్యాలయం మంగళవారం తెలిపింది.

వందలాది మంది గాయపడ్డారని పేర్కొంది. గాజాలోని పాలస్తీనా పౌర రక్షణ దళాలను ఖాళీ చేయాలని ఆదేశించిన కొద్ది నిమిషాలకే ఇజ్రాయిల్‌ వైమానిక దాడికి దిగిన సంగతి తెలిసిందే.

ఇజ్రాయిల్‌ అధికారులతో సమన్వయంతో గాజా నగరానికి ప్రయాణిస్తున్న స్పష్టంగా గుర్తించిన యుఎన్‌ కాన్వాయ్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం దాడి జరిపింది. ఈ దాడికి ఇజ్రాయిల్‌ బాధ్యత వహించాల్సిందిగా యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ చీఫ్‌ ఫిలిప్పె లాజారియా పిలుపునిచ్చారు.

ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడిలో సుమారు 39,006 మంది పాలస్తీనియన్లు మరణించగా, 89,818 మంది గాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com