ఒమన్లో కొత్త సైబర్ మోసాలు..!
- July 26, 2024
మస్కట్ : రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే కొత్త మోసపూరిత పద్ధతుల గురించి హెచ్చరించాయి. “సోషల్ మీడియా అప్లికేషన్ల (వాట్సాప్, స్నాప్చాట్ మరియు ఇన్స్టాగ్రామ్) ద్వారా మోసగాళ్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ అని చెప్పుకునే కొత్త మోసపూరిత పద్ధతి గురించి అప్రమత్తంగా ఉండాలి. సాఫ్ట్ లోన్ సౌకర్యాలతో బాధితులను ప్రలోభపెట్టడమే వారి లక్ష్యం. వారు అటాచ్ చేసిన ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకొని ప్రజలను మోసం చేస్తారు. ఆ తర్వాత నేరస్థులు బాధితుల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకుంటారు. పౌరులు మరియు నివాసితులకు ఈ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా తెలియకపోతే ఎలక్ట్రానిక్ లింక్లను తెరవవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటా లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు.” అని రాయల్ ఒమాన్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







