ఒమన్లో కొత్త సైబర్ మోసాలు..!
- July 26, 2024
మస్కట్ : రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే కొత్త మోసపూరిత పద్ధతుల గురించి హెచ్చరించాయి. “సోషల్ మీడియా అప్లికేషన్ల (వాట్సాప్, స్నాప్చాట్ మరియు ఇన్స్టాగ్రామ్) ద్వారా మోసగాళ్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ అని చెప్పుకునే కొత్త మోసపూరిత పద్ధతి గురించి అప్రమత్తంగా ఉండాలి. సాఫ్ట్ లోన్ సౌకర్యాలతో బాధితులను ప్రలోభపెట్టడమే వారి లక్ష్యం. వారు అటాచ్ చేసిన ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకొని ప్రజలను మోసం చేస్తారు. ఆ తర్వాత నేరస్థులు బాధితుల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకుంటారు. పౌరులు మరియు నివాసితులకు ఈ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా తెలియకపోతే ఎలక్ట్రానిక్ లింక్లను తెరవవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటా లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు.” అని రాయల్ ఒమాన్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!
- 684 మంది ఇంజనీర్లకు SR1.6 మిలియన్ల ఫైన్స్..!!
- 2 ఇండిగో విమానాలు దారి మళ్లింపు.. ప్రయాణికులు అసహనం..!!
- బహ్రెయిన్ లో ప్రవాస ఇంజనీర్ల అర్హతల పై సమీక్ష..!!
- సాయుధ దళాల ధైర్య సాహసాలను ప్రశంసించిన కౌన్సిల్..!!
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!









