ఒమన్లో కొత్త సైబర్ మోసాలు..!
- July 26, 2024
మస్కట్ : రాయల్ ఒమన్ పోలీస్ (ROP), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించే కొత్త మోసపూరిత పద్ధతుల గురించి హెచ్చరించాయి. “సోషల్ మీడియా అప్లికేషన్ల (వాట్సాప్, స్నాప్చాట్ మరియు ఇన్స్టాగ్రామ్) ద్వారా మోసగాళ్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ అని చెప్పుకునే కొత్త మోసపూరిత పద్ధతి గురించి అప్రమత్తంగా ఉండాలి. సాఫ్ట్ లోన్ సౌకర్యాలతో బాధితులను ప్రలోభపెట్టడమే వారి లక్ష్యం. వారు అటాచ్ చేసిన ఎలక్ట్రానిక్ లింక్ ద్వారా వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని తెలుసుకొని ప్రజలను మోసం చేస్తారు. ఆ తర్వాత నేరస్థులు బాధితుల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును ఉపసంహరించుకుంటారు. పౌరులు మరియు నివాసితులకు ఈ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా తెలియకపోతే ఎలక్ట్రానిక్ లింక్లను తెరవవద్దు. సోషల్ మీడియాలో వ్యక్తిగత డేటా లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని బహిర్గతం చేయకూడదు.” అని రాయల్ ఒమాన్ పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







