వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- July 27, 2024
మనామా: ఒక బహ్రెయిన్ జంట తమ ఒప్పందాన్ని బట్వాడా చేయడంలో విఫలమైనందుకు వెడ్డింగ్ ప్లానర్పై దావా వేసారు. ఐదు నెలల ముందుగానే తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్న ఈ జంట, 100 మంది అతిథుల కోసం స్థానిక హోటల్లో వేదిక బుకింగ్ కోసం వెడ్డింగ్ ప్లానర్తో ఒప్పందం కుదుర్చుకుని, మొత్తం 1,750 బహ్రెయిన్ దినార్లు చెల్లించారు.
అయితే, వారి పెళ్లికి రెండు నెలల ముందు వెడ్డింగ్ ప్లానర్ తన కంపెనీ రద్దు చేసింది. వారి డబ్బును తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ప్లానర్ దంపతులకు రీఫండ్ చేయడంలో విఫలమయ్యారు.దీంతో వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేసారు. ప్లానర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఆర్థిక మరియు మానసిక క్షోభ కలిగిందని దావాలో కొత్త జంట వాదించింది.
దావాను విచారించిన సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దావా దాఖలు చేసిన తేదీ నుండి వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని 1,750 దినార్లను తిరిగి చెల్లించాలని వెడ్డింగ్ ప్లానర్ను ఆదేశించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







