వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- July 27, 2024
మనామా: ఒక బహ్రెయిన్ జంట తమ ఒప్పందాన్ని బట్వాడా చేయడంలో విఫలమైనందుకు వెడ్డింగ్ ప్లానర్పై దావా వేసారు. ఐదు నెలల ముందుగానే తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్న ఈ జంట, 100 మంది అతిథుల కోసం స్థానిక హోటల్లో వేదిక బుకింగ్ కోసం వెడ్డింగ్ ప్లానర్తో ఒప్పందం కుదుర్చుకుని, మొత్తం 1,750 బహ్రెయిన్ దినార్లు చెల్లించారు.
అయితే, వారి పెళ్లికి రెండు నెలల ముందు వెడ్డింగ్ ప్లానర్ తన కంపెనీ రద్దు చేసింది. వారి డబ్బును తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ప్లానర్ దంపతులకు రీఫండ్ చేయడంలో విఫలమయ్యారు.దీంతో వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేసారు. ప్లానర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఆర్థిక మరియు మానసిక క్షోభ కలిగిందని దావాలో కొత్త జంట వాదించింది.
దావాను విచారించిన సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దావా దాఖలు చేసిన తేదీ నుండి వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని 1,750 దినార్లను తిరిగి చెల్లించాలని వెడ్డింగ్ ప్లానర్ను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









