వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- July 27, 2024
మనామా: ఒక బహ్రెయిన్ జంట తమ ఒప్పందాన్ని బట్వాడా చేయడంలో విఫలమైనందుకు వెడ్డింగ్ ప్లానర్పై దావా వేసారు. ఐదు నెలల ముందుగానే తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్న ఈ జంట, 100 మంది అతిథుల కోసం స్థానిక హోటల్లో వేదిక బుకింగ్ కోసం వెడ్డింగ్ ప్లానర్తో ఒప్పందం కుదుర్చుకుని, మొత్తం 1,750 బహ్రెయిన్ దినార్లు చెల్లించారు.
అయితే, వారి పెళ్లికి రెండు నెలల ముందు వెడ్డింగ్ ప్లానర్ తన కంపెనీ రద్దు చేసింది. వారి డబ్బును తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ప్లానర్ దంపతులకు రీఫండ్ చేయడంలో విఫలమయ్యారు.దీంతో వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేసారు. ప్లానర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఆర్థిక మరియు మానసిక క్షోభ కలిగిందని దావాలో కొత్త జంట వాదించింది.
దావాను విచారించిన సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దావా దాఖలు చేసిన తేదీ నుండి వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని 1,750 దినార్లను తిరిగి చెల్లించాలని వెడ్డింగ్ ప్లానర్ను ఆదేశించింది.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







