వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- July 27, 2024
మనామా: ఒక బహ్రెయిన్ జంట తమ ఒప్పందాన్ని బట్వాడా చేయడంలో విఫలమైనందుకు వెడ్డింగ్ ప్లానర్పై దావా వేసారు. ఐదు నెలల ముందుగానే తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్న ఈ జంట, 100 మంది అతిథుల కోసం స్థానిక హోటల్లో వేదిక బుకింగ్ కోసం వెడ్డింగ్ ప్లానర్తో ఒప్పందం కుదుర్చుకుని, మొత్తం 1,750 బహ్రెయిన్ దినార్లు చెల్లించారు.
అయితే, వారి పెళ్లికి రెండు నెలల ముందు వెడ్డింగ్ ప్లానర్ తన కంపెనీ రద్దు చేసింది. వారి డబ్బును తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ప్లానర్ దంపతులకు రీఫండ్ చేయడంలో విఫలమయ్యారు.దీంతో వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేసారు. ప్లానర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఆర్థిక మరియు మానసిక క్షోభ కలిగిందని దావాలో కొత్త జంట వాదించింది.
దావాను విచారించిన సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దావా దాఖలు చేసిన తేదీ నుండి వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని 1,750 దినార్లను తిరిగి చెల్లించాలని వెడ్డింగ్ ప్లానర్ను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









