వెడ్డింగ్ ప్లానర్ పై దావా గెలిచిన కొత్త జంట..!
- July 27, 2024
మనామా: ఒక బహ్రెయిన్ జంట తమ ఒప్పందాన్ని బట్వాడా చేయడంలో విఫలమైనందుకు వెడ్డింగ్ ప్లానర్పై దావా వేసారు. ఐదు నెలల ముందుగానే తమ పెళ్లిని ప్లాన్ చేసుకున్న ఈ జంట, 100 మంది అతిథుల కోసం స్థానిక హోటల్లో వేదిక బుకింగ్ కోసం వెడ్డింగ్ ప్లానర్తో ఒప్పందం కుదుర్చుకుని, మొత్తం 1,750 బహ్రెయిన్ దినార్లు చెల్లించారు.
అయితే, వారి పెళ్లికి రెండు నెలల ముందు వెడ్డింగ్ ప్లానర్ తన కంపెనీ రద్దు చేసింది. వారి డబ్బును తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ప్లానర్ దంపతులకు రీఫండ్ చేయడంలో విఫలమయ్యారు.దీంతో వారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోర్టులో దావా వేసారు. ప్లానర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్ల ఆర్థిక మరియు మానసిక క్షోభ కలిగిందని దావాలో కొత్త జంట వాదించింది.
దావాను విచారించిన సివిల్ ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు జంటకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దావా దాఖలు చేసిన తేదీ నుండి వడ్డీతో సహా పూర్తి మొత్తాన్ని 1,750 దినార్లను తిరిగి చెల్లించాలని వెడ్డింగ్ ప్లానర్ను ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







