పారిస్ ఒలింపిక్స్లో పంచ్ పవర్ చూపించిన భారత బాక్సర్ నిఖత్ జరీన్
- July 28, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ పంచ్ పవర్ చూపించింది. 50 కిలోల విభాగంలో శుభారంభం చేసి 16వ రౌండ్లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన బౌట్లో జర్మనీ బాక్సర్ మాక్సీ కరినా క్లొయెట్జర్ ను నిఖత్ చిత్తుగా ఓడించింది. ప్రత్యర్థిపై పంచ్ల వర్షం కురిపించిన తెలంగాణ బిడ్డను జడ్జిలు ఏకగ్రీవంగా విజేతగా ప్రకటించారు.
ఒలింపిక్స్లో కఠినమైన ప్రత్యర్థుల గ్రూప్లో ఉన్న నిఖత్ జరీన్ తొలి అడుగు ఘనంగా వేసింది. ఆరంభం నుంచే మాక్సీపై విరుచుకుపడింది. దాంతో, మ్యాక్సీ కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఏకపక్ష పోరులో నిఖత్ 5-0తో గెలుపొందింది. ఆగస్టు 1న జరిగే తర్వాతి రౌండ్లో ఆమె చైనా బాక్సర్ వు యూతో తలపడనుంది.
తాజా వార్తలు
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్







