మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై కేసు
- July 29, 2024
హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ స్కామ్పై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ-5 నిందితుడిగా సోమేశ్ కుమార్ పేరును చేర్చారు.
సోమేశ్ కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ విశ్వేశ్వర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఎ.శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కేసు నమోదు చేశారు. సీసీఎస్లో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది.
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో చెల్లింపుల్లో 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ ఇన్వాయిస్ లు సృష్టించి నిందితులు మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.
ఫోరెన్సిక్ అడిట్లో ఈ అవకతవకలు వెలుగు చూశాయి. మాజీ సీఎస్ సోమేశ్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. స్కామ్ కు పాల్పడ్డ నిందితులపై 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. త్వరలో నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించనున్నారు.
తాజా వార్తలు
- 2026 నూతన నాయకత్వాన్ని ఎంచుకోనున్న WTITC
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ 2025..ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా కల్కి 2898AD
- వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం







