గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష
- July 30, 2024
విజయవాడ: గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉన్నత స్థాయు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఛాంబర్లో ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్లతో విభిన్న అంశాలపై చర్చించారు.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, జిల్లాల వారీగా ఇసుక లభ్యత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.ప్రతి జిల్లా లోనూ డిమాండ్ మేరకు ఇసుక లభించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు.ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మించి ఎక్కడా వసూళ్లకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలవుతున్న పరిస్థితులను వివరించారు.కార్యక్రమంలో ఆబ్కారీ, గనుల శాఖ ముఖ్య అధికారులు దేవకుమార్, అనుసూయా దేవి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్గా బి.సుమతి బాధ్యతల స్వీకరణ
- కార్పొరేట్ ట్యాక్స్ బిల్లులో లోపాలను ఎత్తిచూపిన పార్లమెంట్ ప్యానెల్..!!
- 3 గంటల రెస్క్యూ..మహిళను రక్షించిన యూఏఈ హైకర్..!!
- 2026 Q1లో సౌదీ GDP 2.8% వృద్ధి..!!
- ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై QCAA కఠిన చర్యలు..!!
- ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక..ఒమన్ 7 స్థానాలు మెరుగు..!!
- కువైట్ లో జూన్ 30 వరకు కార్మికుల బదిలీలు..!!
- ఈ ఆదివారం నుంచి జజీరా ఎయిర్వేస్ పూర్తిస్థాయి సేవలు పునఃప్రారంభం
- పర్యావరణ అసమతుల్యంతో ఎండ తీవ్రత
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!









