సర్వీసులను రీషెడ్యూల్ చేసిన దుబాయ్ ఎయిర్లైన్!
- July 31, 2024
దుబాయ్: ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్లోని బీరూట్కు తన విమాన కార్యకలాపాలను రీ షెడ్యూల్ చేసినట్టు దుబాయ్ క్యారియర్ ఫ్లైదుబాయ్ ప్రకటించింది. "ఫ్లైదుబాయ్ తన విమాన షెడ్యూల్ను బీరూట్ ఎయిర్పోర్ట్ (BEY)కి సవరించింది. ఆగస్టు 2 వరకు రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాము." అని ఫ్లైదుబాయ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో రద్దీగా ఉండే ప్రయాణ కాలానికి అనుగుణంగా ఎయిర్లైన్ గతంలో రోజుకు మూడు విమానాలను నడుపుతోంది. అనేక ఇతర విమానయాన సంస్థలు కూడా బీరుట్కి తమ విమానాలను రద్దు చేశాయి. లెబనాన్లోని మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా మరియు స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, యూరోవింగ్ విమానాలు ఇప్పటివరకు ప్రభావితమయ్యాయి. ప్రయాణికులు తమ విమాన స్థితిని క్రమం తప్పకుండా చూసుకోవాలని ఫ్లైదుబాయ్ సూచించింది.
తాజా వార్తలు
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!







