సర్వీసులను రీషెడ్యూల్ చేసిన దుబాయ్ ఎయిర్లైన్!
- July 31, 2024
దుబాయ్: ఇజ్రాయెల్ మరియు హిజ్బుల్లా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్లోని బీరూట్కు తన విమాన కార్యకలాపాలను రీ షెడ్యూల్ చేసినట్టు దుబాయ్ క్యారియర్ ఫ్లైదుబాయ్ ప్రకటించింది. "ఫ్లైదుబాయ్ తన విమాన షెడ్యూల్ను బీరూట్ ఎయిర్పోర్ట్ (BEY)కి సవరించింది. ఆగస్టు 2 వరకు రెండు రోజువారీ విమానాలను నడుపుతుంది. మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నాము." అని ఫ్లైదుబాయ్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిలో రద్దీగా ఉండే ప్రయాణ కాలానికి అనుగుణంగా ఎయిర్లైన్ గతంలో రోజుకు మూడు విమానాలను నడుపుతోంది. అనేక ఇతర విమానయాన సంస్థలు కూడా బీరుట్కి తమ విమానాలను రద్దు చేశాయి. లెబనాన్లోని మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా మరియు స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్, యూరోవింగ్ విమానాలు ఇప్పటివరకు ప్రభావితమయ్యాయి. ప్రయాణికులు తమ విమాన స్థితిని క్రమం తప్పకుండా చూసుకోవాలని ఫ్లైదుబాయ్ సూచించింది.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









