కేంద్ర మంత్రి రామ్మోహన్ కి ప్రవాసుల డిమాండ్
- August 01, 2024
న్యూ ఢిల్లీ: విశాఖపట్నం టూ దుబాయ్ వయా హైదరాబాద్ విమాన సర్వీస్ 2013-2020 వరకు అంటే కోవిడ్ సమయం వరకు సజావుగా నడిచింది.
2020లో కోవిడ్ తీవ్రత మూలంగా విమానయాన సేవలు ఆపేయడం జరిగింది. కరోనా తర్వాత కూడా ఎయిర్ ఇండియా ఈ రూట్ విమాన సర్వీస్ ను తిరిగి పునరుద్ధరణ చేయలేదు.
ఎయిర్ ఇండియా/ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రైవేటైయిజ్ కావడం వల్ల ఈ రూట్ పునరుద్దరణకు కొత్త ఎయిర్ ఇండియా యాజమాన్యం సుముఖత చూపలేదు. ఎంత ప్రయత్నం చేసినా కూడా బీ టౌన్ కావడం వల్ల యాజమాన్యం ఈ విమాన సర్వీస్ ను పునరుద్ధరణ చేయలేదు.
అదృష్టవశాత్తు తెలుగు వాడైన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రి కావడం వల్ల శుక్రవారం, 26 జులైన వారిని కలిసి దుబాయ్ విశాఖపట్నం ట్రావెలర్స్ ఫోరమ్ తరుపున విమాన సర్వీస్ పునరుద్ధరణ చేయమని విన్నపాన్ని శరత్ యలవర్తి అందజేశారు.
వారు సహృదయంతో మా విన్నపాన్ని స్వీకరించి అతి త్వరలోనే శాఖా పరంగా చర్యలు తీసుకోవడానికి సుముఖుత చూపించారని శరత్ యలవర్తి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







