యూఏఈలో విమాన ఛార్జీలు రెట్టింపు..!
- August 02, 2024
యూఏఈ: ఈ నెల చివరిలో స్కూల్స్ ప్రారంభానికి ముందే ఇన్బౌండ్ యూఏఈ విమాన ఛార్జీలు దాదాపు రెట్టింపు అవుతాయి. యూఏఈలో నివసించే కుటుంబాలు సెలవుల సమయంలో తమ స్వదేశాలకు వెళ్లి వచ్చే సమయం కావడంతో అధిక డిమాండ్ ఉండి విమాన ఛార్జీల పెరుగుదలకు కారణం అవుతుందని విమానయానరంగ నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో స్కూల్స్ ఆగస్టు 26న పునర్ ప్రారంభం కానున్నాయి. ఈ నేఫథ్యంలో మిడిల్ ఈస్ట్, ఆసియా మరియు యూరప్లోని అనేక గమ్యస్థానాలలో డిమాండ్ అధికంగా ఉండటంతో ఇన్బౌండ్ విమాన ఛార్జీలు పెరిగాయని దుబాయ్లోని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.
యూఏఈ జనాభాలో సగానికి పైగా దక్షిణాసియా జాతీయులు ఉన్నందున భారత ఉపఖండంలోని మార్గాలలో కూడా విమాన ఛార్జీలలో పెద్ద పెరుగుదల కనిపించిందన్నారు. ముఖ్యంగా ముంబై, కేరళ వంటి భారతీయ రూట్లలో విమాన ఛార్జీలు 50 శాతానికి పైగా పెరిగాయని తెలిపారు. ఈ పీక్ సీజన్లో కొన్ని మార్గాల్లో విమాన ఛార్జీలు దాదాపు రెట్టింపు అవుతాయని Musafir.com వద్ద కార్యకలాపాల వైస్ ప్రెసిడెంట్ రషీదా జాహిద్ తెలిపారు. డేరా ట్రావెల్ అండ్ టూరిస్ట్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ TP సుధీష్ మాట్లాడుతూ.. ఆగస్టు 15 నుండి సెప్టెంబరు ప్రారంభం వరకు పీక్ సీజన్ ఉంటుందన్నారు. అదే విధంగా, ఆగస్టు చివరిలో వచ్చే విమానాలకు ఆఫ్రికన్ రూట్లలో కూడా భారీ డిమాండ్ ఉందని సుధీష్ తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి