నేషనల్ రీసెర్చ్ కాంటెస్ట్.. ముగిసిన గడువు..భారీగా దరఖాస్తులు..!
- August 02, 2024
మస్కట్: ఉన్నత విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ 11వ నేషనల్ రీసెర్చ్ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ ముగింపును ప్రకటించింది. డాక్టరేట్ (పిహెచ్డి హోల్డర్లు-ఫస్ట్ కేటగిరీ) ఉన్న పరిశోధకులు సమర్పించిన 167, పిహెచ్డి లేనివారు (సెకండ్ కేటగిరీ) 107 మందితో సహా 274 దరఖాస్తులు అవార్డు కోసం వచ్చాయని తెలిపింది. ఆరోగ్య మరియు సమాజ సేవా విభాగంలో 52; పర్యావరణం మరియు కీలక వనరుల విభాగంలో 50; విద్య మరియు మానవ వనరుల విభాగంలో 76; సంస్కృతి, సామాజిక మరియు ప్రాథమిక శాస్త్రాల విభాగంలో 43 అప్లికేషన్లు; శక్తి మరియు పరిశ్రమల విభాగంలో 34; కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ విభాగంలో 19 అప్లికేషన్లు వచ్చాయన్నారు. వచ్చిన రెండు కేటగిరీలలో ప్రతిదానిలో ఆరుగురు విజేతలకు అవార్డు ఇవ్వబడుతుందని వెల్లడించారు. అవార్డుల విజేతలను డిసెంబర్ 2024లో సత్కరించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









