రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్..

- August 08, 2024 , by Maagulf
రెజ్లింగ్‌కు గుడ్ బై అంటూ వినేశ్ ఫొగట్ ట్వీట్..

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పింది. ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ ఫైనల్ ముందు అధిక బరువుతో అనర్హత వేటుకి గురికావడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది ఆమె. తన రిటైర్మెంట్ పై ఎక్స్ లో వినేశ్ ఫొగట్ పోస్టు చేసింది.

‘నాపై రెజ్లింగ్.. మ్యాచ్ గెలిచింది. నేను ఓడిపోయాను.. నా ధైర్యాన్ని కోల్పోయాను. నాకు ఇక శక్తిలేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024..’ అని ఆమె చెప్పింది. అందరికీ తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, తనను క్షమించాలని ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను ఫొగట్ ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తీర్పును వెలువడించాల్సి ఉంది. పతకానికి అడుగు దూరంలో వినేశ్‌ ఫొగట్‌కు ఎదురుదెబ్బ తగలడంతో భారతీయులు నిరాశ చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com