వంద మెడికల్ సీట్లతో సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాల
- June 16, 2016
హైదరాబాద్: 2016-17 విద్యా సంవత్సరానికి వంద మెడికల్ సీట్లతో సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం హైదరాబాద్ హిల్పోర్టు రోడ్డులోని ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద మెడికల్ సీట్లలో 35 సీట్లను తెలంగాణ కార్మికుల పిల్లలకు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
జులై 27, 28 తేదీల్లో హైదరాబాద్లో ఉపాధి కల్పనా అంశంపై బ్రిక్ దేశాల ప్రతినిధులతో సదస్సు ఏర్పాటు చేస్తామన్నారు.వచ్చే మూడేళ్లలో దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పనపైనే తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. నేషనల్ కెరీర్ పోర్టల్ ఆధ్వర్యంలో సీఐఐ సహకారంతో జులై మూడోవారంలో ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్మేళా నిర్వహిస్తామన్నారు. త్వరలో దేశవ్యాప్తంగా వంద మోడల్ కెరీర్ సెంటర్లను నెలకొల్పుతామన్నారు. కూకట్పల్లిలో 5ఎకరాల స్థలంలో ఈఎస్ఐ ప్రాంతీయ కార్యాలయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రమంత్రులు కేంద్రమందించే సాయంపై వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలన్నారు. హైదరాబాద్కు సంబంధించి ఐటీఐఆర్ ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొందించి తనకు తెలియజేస్తే కేంద్రానికి విన్నవించి తగిన సహకారం అందిస్తామన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







