అవయవ దానం పై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- August 08, 2024
అమరావతి: అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆస్పత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ లేదా సీనియర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. అవయవ దాతల కుటుంబాలకు రూ.10,000 పారితోషికం పూలు, శాలువా, ప్రశంసా పత్రాలకు అదనంగా మరో రూ.1000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









