అవయవ దానం పై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

- August 08, 2024 , by Maagulf
అవయవ దానం పై మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: అవయవదానంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను పాటించాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఆస్పత్రిలోని డీన్, మెడికల్ సూపరింటెండెంట్‌ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రుల నుంచి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లా క‌లెక్టర్ లేదా సీనియ‌ర్ అధికారి అంతిమ సంస్కారంలో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. అవ‌య‌వ దాత‌ల కుటుంబాల‌కు రూ.10,000 పారితోషికం పూలు, శాలువా, ప్రశంసా ప‌త్రాల‌కు అద‌నంగా మరో రూ.1000 ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com