బిజినెస్ బే హత్య కేసు..యువకుడికి జీవిత ఖైదు..5 మంది విడుదల
- August 09, 2024
దుబాయ్: బిజినెస్ బే హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు పడగా,మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మే 2023లో బిజినెస్ బే ఏరియాలో జరిగిన హత్యలో తమ 19 ఏళ్ల స్వదేశీయుడికి సహాయం చేయడం మరియు ప్రోత్సహించడం వంటి నేరారోపణలను తోసిపుచ్చిన దుబాయ్ అప్పీల్ కోర్ట్.. ఐదుగురు ఇజ్రాయెలీలను నిర్దోషులుగా ప్రకటించింది. షిషా కేఫ్ వెలుపల 33 ఏళ్ల ఇజ్రాయెల్ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జనవరిలో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 33 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన
కేసులో యువకుడిని దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించారు. మరోవైపు మరో ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. శిక్షలు అనుభవించిన తర్వాత ఆ ఆరుగురిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.హత్య జరిగిన 24 గంటల లోపే దుబాయ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..









