బిజినెస్ బే హత్య కేసు..యువకుడికి జీవిత ఖైదు..5 మంది విడుదల
- August 09, 2024
దుబాయ్: బిజినెస్ బే హత్య కేసులో యువకుడికి జీవిత ఖైదు పడగా,మరో 5 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. మే 2023లో బిజినెస్ బే ఏరియాలో జరిగిన హత్యలో తమ 19 ఏళ్ల స్వదేశీయుడికి సహాయం చేయడం మరియు ప్రోత్సహించడం వంటి నేరారోపణలను తోసిపుచ్చిన దుబాయ్ అప్పీల్ కోర్ట్.. ఐదుగురు ఇజ్రాయెలీలను నిర్దోషులుగా ప్రకటించింది. షిషా కేఫ్ వెలుపల 33 ఏళ్ల ఇజ్రాయెల్ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
జనవరిలో దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ 33 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపిన
కేసులో యువకుడిని దోషిగా నిర్ధారించింది. అతనికి జీవిత ఖైదు విధించారు. మరోవైపు మరో ఐదుగురు నిందితులకు ఒక్కొక్కరికి పదేళ్ల చొప్పున జైలుశిక్ష పడింది. శిక్షలు అనుభవించిన తర్వాత ఆ ఆరుగురిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.హత్య జరిగిన 24 గంటల లోపే దుబాయ్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









