కెనడాలో నోవా మల్టీఫెస్ట్ వేడుకలు 2024!
- August 10, 2024
టొరంటో: కెనడాలోని హాలిఫాక్స్ &. డార్ట్ మౌత్ వాసులు మన భారత సంస్కృతి మరియు భారత సంప్రదాయాలను కెనడా నోవా స్కోషియా హాలిఫాక్స్ నగరంలో సగర్వంగా వైభవంగా ప్రదర్శించారు.విశాల్ భరద్వాజ్ మరియు వారి బృందం, CEO జోసెఫ్ ఈ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి 27,000 మందికి పైగా ముఖ్యంగా కెనడా దేశస్తులు, స్థానిక భారతీయులు హాజరయ్యి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శ్రీహరి రెడ్డి చల్లా మన దేశం/రాష్ట్రం తరఫున కార్యకలాపాలను నిర్వహించారు. శ్రీహరి బృందం,సురేష్ ప్రియాంక, మిస్ శ్రీలేఖ,చంద్ర శ్రీలేఖ, శ్రీ మిలింద్,శ్రీ శ్రీకాంత్, చిరంజీవి రోహిత్, చిరంజీవి సోను, ప్రదీప్ సౌజన్య, మిస్ ఆస్తా, కృష్ణవేణి,రత్నం, శ్యామల, మిస్ సాత్వికీ మరియు మిస్ కావ్య ఉన్నారు, భారతీయ సంస్కృతిని ప్రదర్శించారు,దీనిలో భారతీయ నృత్యాలు, యుద్ధ కళలు, సంగీతం మరియు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రదర్శించే ఫ్యాషన్ షో ఉన్నాయి. అదనంగా, ఈ కార్యక్రమంలో భారతీయ దుస్తుల స్టాల్ మరియు భారతీయ ఆహార స్టాల్ ను ఏర్పాటు చేసి మన సంస్కృతిని ప్రోత్సహించారు.
ఏ దేశ మేగినా ఎందు కాలిడినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపర నీ జాతి నిండు గౌరవాన్ని అంటూ, 4-7 ఏళ్ల పిల్లలు భారతీయ నృత్యం మరియు శాస్త్రీయ సంగీతాన్ని ప్రదర్శించారు, ఇది భారతీయ్యులకి , చుట్టూ పక్కల ప్రాంతీయాయులకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చిరంజీవి శిబి నేతని కర్రసాము ప్రదర్శన ఇచ్చారు, చిరంజీవి హర్ష లైట్ మ్యూజిక్ పాడారు, కుమారి జనని భారతనాట్యం ప్రదర్శించారు, కుమారి సంగీత ఒడిసి నృత్యం ప్రదర్శించారు మరియు ఆరాధ్య కుచిపూడి ప్రదర్శించారు. హాలిఫాక్స్ లోని అందరు భారతీయుల కి ఇది ఒక కనులవిందు మరియు ఇతర సంస్కృతుల ప్రజలు కూడా ఈ ప్రదర్శనలను ఎంతో ఆనందించారు.
వివిధ వంటకాల షడ్రుచులతో, కార్య క్రమాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా జరిగిన తీరు అందరిని ఆకట్టుకుంది.వేడుకలను ఘనంగా నిర్వహించిన,పెద్దలు, వాలంటీ ర్లు, ముఖ్యంగా కార్యక్రమానికి విచ్చేసిన అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు కు మెచ్చుకొన్నారు.
కెనడా నోవా స్కోషియా వేడుకలు అంగరంగ వైభవంగా, ఘనంగా ముగిసింది.




తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







