బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!
- August 14, 2024
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సౌత్ సినిమాలు హిట్ లిస్టులో చేరుతున్న సంగతీ తెలిసిందే.
అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్కి చాలా చాలా ప్రెస్టీజియస్. సంజయ్ దత్ లక్కు పూరీ జగన్నాధ్కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాలి.
ఇండిపెండెన్స్డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంజయ్ దత్ మీడియాతో చేసిన చిట్చాట్ ఆకర్షణగా నిలిచింది. ఈ చిట్చాట్లో బాలీవుడ్ సినిమాల్ని వుద్దేశించి సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాస్, యాక్షన్ మిళితమై వుండేది. అందుకే అప్పట్లో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు అక్కడ అది మిస్ అవుతోంది. అది సౌత్ సినిమాల్లో కనిపిస్తోంది. అందుకే సౌత్ సినిమాలు దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నాయ్.
బాలీవుడ్కీ తిరిగి అలాంటి వైభవం రావాలని కోరుకుంటున్నా.! ‘డబుల్ ఇస్మార్ట్’లో నా పాత్ర చాలా శక్తివంతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ పూరీ..’ అని సంజయ్దత్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







