బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!
- August 14, 2024
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సౌత్ సినిమాలు హిట్ లిస్టులో చేరుతున్న సంగతీ తెలిసిందే.
అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్కి చాలా చాలా ప్రెస్టీజియస్. సంజయ్ దత్ లక్కు పూరీ జగన్నాధ్కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాలి.
ఇండిపెండెన్స్డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంజయ్ దత్ మీడియాతో చేసిన చిట్చాట్ ఆకర్షణగా నిలిచింది. ఈ చిట్చాట్లో బాలీవుడ్ సినిమాల్ని వుద్దేశించి సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాస్, యాక్షన్ మిళితమై వుండేది. అందుకే అప్పట్లో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు అక్కడ అది మిస్ అవుతోంది. అది సౌత్ సినిమాల్లో కనిపిస్తోంది. అందుకే సౌత్ సినిమాలు దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నాయ్.
బాలీవుడ్కీ తిరిగి అలాంటి వైభవం రావాలని కోరుకుంటున్నా.! ‘డబుల్ ఇస్మార్ట్’లో నా పాత్ర చాలా శక్తివంతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ పూరీ..’ అని సంజయ్దత్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







