బాలీవుడ్పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్.!
- August 14, 2024
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరుసగా సౌత్లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన సౌత్ సినిమాలు హిట్ లిస్టులో చేరుతున్న సంగతీ తెలిసిందే.
అలా ఆయన నటించిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాధ్కి చాలా చాలా ప్రెస్టీజియస్. సంజయ్ దత్ లక్కు పూరీ జగన్నాధ్కి కలిసొస్తుందో లేదో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాలి.
ఇండిపెండెన్స్డే కానుకగా ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సంజయ్ దత్ మీడియాతో చేసిన చిట్చాట్ ఆకర్షణగా నిలిచింది. ఈ చిట్చాట్లో బాలీవుడ్ సినిమాల్ని వుద్దేశించి సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయ్.
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాల్లో మాస్, యాక్షన్ మిళితమై వుండేది. అందుకే అప్పట్లో సినిమాలు సూపర్ హిట్స్ అయ్యేవి. కానీ ఇప్పుడు అక్కడ అది మిస్ అవుతోంది. అది సౌత్ సినిమాల్లో కనిపిస్తోంది. అందుకే సౌత్ సినిమాలు దేశం గర్వించదగ్గ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచుతున్నాయ్.
బాలీవుడ్కీ తిరిగి అలాంటి వైభవం రావాలని కోరుకుంటున్నా.! ‘డబుల్ ఇస్మార్ట్’లో నా పాత్ర చాలా శక్తివంతంగా డిజైన్ చేశారు డైరెక్టర్ పూరీ..’ అని సంజయ్దత్ వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







