ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్న్యూస్
- August 16, 2024
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పించింది.
తాజాగా ఆర్టీసీ ప్రయాణికులకు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని ఆర్టీసీ విజయవంతంగా అమలు చేస్తోందని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ పేర్కొన్నారు. సిబ్బంది క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు.
మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ తెలిపారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు యాజమాన్యం ప్లాన్ చేస్తోందని చెప్పారు. త్వరలో కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నాయని చెప్పారు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు వాటిని నడిపేందుకు సంస్థ చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంను సంస్థ అమలు చేస్తోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. బస్సుల్లో యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డులతో కూడిన డిజిటల్ పేమెంట్స్, స్మార్ట్ కార్డ్స్, మొబైల్ టికెట్స్, మొబైల్ బస్ పాస్ ల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ఎండీ సజ్జనార్ ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటికే డిజిటల్ పేమెంట్స్కు సంబంధించిన ఫైలట్ ప్రాజెక్ట్ దిల్ సుఖ్ నగర్, బండ్లగూడ డిపోల్లో అమలవుతోందన్నారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- ఐరా ‘స్పా’ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్!
- బసవతారకం హాస్పిటల్: ఏపీ వాసులకు శుభవార్త..









