వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీపై దావా వేసిన నూతనవధువు..!
- August 18, 2024
బహ్రెయిన్: వివాహ ప్రణాళిక సంస్థపై ఓ నూతన వధువు కోర్టుకెక్కింది. ఈవెంట్ కంపెనీ తన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైందని తన దావాలో పేర్కొంది. పెళ్లి రోజును మరియు గణనీయమైన ఆర్థిక నష్టాలను మిగిల్చిందని, ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కోర్టుకు తెలిపింది. తనకు జరిగిన నష్టానికి ఈవెంట్ యజమాని నుంచి పరిహారం ఇప్పించాలని వధువు తరఫు న్యాయవాది కోరారు.
ఒక హోటల్లో తన వివాహాన్ని ఏర్పాటు చేయడానికి వధువు కంపెనీతో ఒప్పందంపై సంతకం చేసిందని, మొత్తం 8,000 దినార్లతోపాటు అదనపు భోజనం సదుపాయం కోసం అదనంగా 920 దినార్లు చెల్లించినట్టు దావాలో పేర్కొన్నారు.అయితే, కంపెనీ తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమైందని, ముందుగా అనుకున్న పెళ్లి మండపాన్ని బుక్ చేయలేదని, కాంట్రాక్ట్ నిబంధనలను పూర్తిగా బేఖాతరు చేసిందని వధువు దావాలో వెల్లడించింది.
కేసును విచారించిన కోర్టు..వధువుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఒప్పందాన్ని రద్దు చేసి, క్లెయిమ్ చేసిన తేదీ నుండి పూర్తిగా తిరిగి చెల్లించే వరకు 3% వార్షిక వడ్డీతో పాటు వధువుకు పూర్తి మొత్తం 10,920 దినార్లను తిరిగి చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. వధువు లీగల్ ఫీజులు మరియు ఖర్చులను భరించాలని కోర్టు కంపెనీని ఆదేశించింది.
తాజా వార్తలు
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్లో ఓవర్స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...









