జైశంకర్‌తో కువైట్ విదేశాంగ మంత్రి భేటీ

- August 19, 2024 , by Maagulf
జైశంకర్‌తో కువైట్ విదేశాంగ మంత్రి భేటీ

కవైట్: కువైట్‌లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా ఆదివారం డాక్టర్ ఎస్ జైశంకర్‌తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ సహకార రంగాలపై ఇరువురు చర్చించారు.ఈ ప్రాంతంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు, ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే ఫ్రేమ్‌వర్క్‌లు మరియు ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను సమీకరించడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి అల్-యాహ్యా భారత ప్రతినిధి బృందానికి గౌరవార్థం లంచ్‌ని ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com