జైశంకర్తో కువైట్ విదేశాంగ మంత్రి భేటీ
- August 19, 2024
కవైట్: కువైట్లో భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అల్-యాహ్యా ఆదివారం డాక్టర్ ఎస్ జైశంకర్తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో డిప్యూటీ విదేశాంగ మంత్రి షేక్ జర్రా జాబర్ అల్-అహ్మద్ అల్-సబా కూడా పాల్గొన్నారు.రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. వివిధ సహకార రంగాలపై ఇరువురు చర్చించారు.ఈ ప్రాంతంలో ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలు, ఉమ్మడి సహకారాన్ని పెంపొందించే ఫ్రేమ్వర్క్లు మరియు ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను సమీకరించడం గురించి కూడా సమావేశంలో చర్చించారు. అనంతరం విదేశాంగ మంత్రి అల్-యాహ్యా భారత ప్రతినిధి బృందానికి గౌరవార్థం లంచ్ని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









