ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపు.. ఆగస్ట్ 31 వరకు మాత్రమే..!
- August 21, 2024
దోహా: ఖతార్ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు 2024 సెప్టెంబరు 1 నుండి అమలులోకి వస్తాయి. వీటి ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్న వ్యక్తులు అన్ని జరిమానాలు, బకాయి చెల్లింపులు చెల్లించే వరకు ఖతార్ దాటి ప్రయాణించడానికి అనుమతించబడరు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులతో పాటు పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు అన్ని మోటారు వాహనాలకు ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపును మంత్రిత్వ శాఖ మరోసారి తన సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా ప్రజలకు గుర్తు చేసింది. ఇది ఆగస్టు 31, 2024 వరకు కొనసాగుతుందని తెలిపింది. మూడు సంవత్సరాలకు మించని వ్యవధిలో నమోదు చేయబడిన ఉల్లంఘనలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ నియమాలు, నిబంధనల పట్ల నిబద్ధతను కలిగి ఉండాలని సూచించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్బెల్ట్ను ధరించడం ద్వారా రక్షణ లభిస్తుందని,రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ తీవ్రతను తగ్గిస్తుంది." అని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ఇటీవల తన X ఖాతాలో పోస్ట్లో సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 999కి కాల్ చేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









