ట్రాఫిక్ జరిమానాలపై 50 శాతం తగ్గింపు.. ఆగస్ట్ 31 వరకు మాత్రమే..!
- August 21, 2024
దోహా: ఖతార్ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలు 2024 సెప్టెంబరు 1 నుండి అమలులోకి వస్తాయి. వీటి ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్న వ్యక్తులు అన్ని జరిమానాలు, బకాయి చెల్లింపులు చెల్లించే వరకు ఖతార్ దాటి ప్రయాణించడానికి అనుమతించబడరు. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల పౌరులతో పాటు పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు అన్ని మోటారు వాహనాలకు ట్రాఫిక్ జరిమానాలపై 50% తగ్గింపును మంత్రిత్వ శాఖ మరోసారి తన సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా ప్రజలకు గుర్తు చేసింది. ఇది ఆగస్టు 31, 2024 వరకు కొనసాగుతుందని తెలిపింది. మూడు సంవత్సరాలకు మించని వ్యవధిలో నమోదు చేయబడిన ఉల్లంఘనలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ నియమాలు, నిబంధనల పట్ల నిబద్ధతను కలిగి ఉండాలని సూచించింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్బెల్ట్ను ధరించడం ద్వారా రక్షణ లభిస్తుందని,రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయ తీవ్రతను తగ్గిస్తుంది." అని అంతర్గత మంత్రిత్వ శాఖ (MoI) ఇటీవల తన X ఖాతాలో పోస్ట్లో సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 999కి కాల్ చేయాలని ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







